పవన్ కల్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా నుండి బోర్ కొట్టే 12 నిమిషాల సీన్స్ కట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వాటి స్థానంలో కొత్తగా 7 నిమిషాల 26 సెకన్ల సీన్స్ యాడ్ చేస్తున్నారట. భారీ అంచనాలతో వచ్చిన అజ్ఞాతవాసి అంచనాలను అందుకోకపోవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. జల్సా, అత్తారింటికి దారేది సినిమా ల రేంజ్ లో సినిమా ఉంటుందని భావించిన ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ పరంగా ఓకే అనిపించుకుంది. త్రివిక్రం మ్యాజిక్ ఎక్కడో మిస్ అయ్యిందంటూ కామ్మెంట్లు రాగా సినిమా అంతా ఏదో టైం పాస్ చేసినట్టు ఉందని కొంతమంది ఫీలింగ్. అయితే టైటిల్ కార్డ్ లో వెంకటేష్ కు థ్యాంక్స్ అంటూ వేసి తీరా సినిమాలో లేకుండా చేశారు.


అయితే సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో ఇప్పుడు ఆ సీన్స్ యాడ్ చేయాలని చూస్తున్నారు. బోర్ కొట్టించిన 12 నిమిషాల సీన్స్ కట్ చేసి 7 నిమిషాల 26 సెకన్ల సీన్ యాడ్ చేస్తున్నారట. మొత్తానికి త్రివిక్రం సినిమాకు రీ ఎడిటింగ్ తప్పలేదు. ఈ కాంబినేషన్ లో అతంకుముందు వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ కాంబినేషన్ ఎలాంటి సినిమా తీసినా పక్కా హిట్ అనుకున్నారు. కాని సినిమా మాత్రం అనూహ్యంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.


సంక్రాంతి నుండి ఈ కొత్త సీన్స్ యాడ్ చేస్తారని అంటున్నారు. టాక్ బాగా లేకున్నా సరే కలక్షన్స్ నెట్టుకొస్తున్న ఈ సినిమా యాడ్ చేసే సీన్స్ కొంత లాభం చేస్తాయేమో చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా రిజల్ట్ పై కాస్త అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. మరి యాడ్ చేసే సీన్స్ తో అజ్ఞాతవాసి అదరగొడతాడో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: