తెలుగు ఇండస్ట్రీలో 80,90వ దశకంలో తన అందాలతో కుర్రాకారుకి శగలు పుట్టించిన హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు తెరపై మంచి ఫామ్ లో ఉండగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మూడేళ్ల వయసులో 1967 జూలై 7వ తేదీన శ్రీదేవి తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఐదు దశాబ్దాలపాటు వెండితెర దేవతగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొన్నారు.
శ్రీదేవి ‘పదహారేళ్లవయసు’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. అప్పటి నుంచి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్,శోభన్ బాబు,కృష్ణలతో నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. అందంతో పాటు అద్భుతమైన నటన కనబరిచిన శ్రీదేవి ఆ తరం హీరోలతోనే కాకుండా వారి వారసులతో కూడా నటించింది. నాగార్జున, వెంకటేష్ తో నటించి తన సత్తా చాటింది. బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత చాలా కాలం వరకు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు శ్రీదేవి.
ఆ మద్య ఇంగ్లిష్..వింగ్లిష్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత తమిళంలో హీరో విజయ్ నటించిన ‘పులి’ చిత్రం తర్వాత ‘మామ్’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ లో కూడా హీరోయిన్లు గా ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు. ఇక శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటిస్తున్న డెబ్యూట్ మూవీ 'ధడక్'. షాహిద్కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్, జాన్వీకపూర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నది. సూపర్హిట్ మరాఠి చిత్రం సైరత్ కు రీమేక్గా ధడక్ తెరకెక్కుతోంది.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లను ప్రముఖ డైరెక్టర్ కరణ్జోహార్ రిలీజ్ చేశాడు. ఫస్ట్లుక్లో శ్రీదేవిని మరిపించేలా కనిపిస్తోంది జాన్వీకపూర్. జాన్వీకపూర్ తొలి సినిమా కోసం బాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీలు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. జాన్వీ కపూర్ అందానికి లక్షల మంది ఫిదా అయిపోతున్నారు. ఆమెను ఆరాధ్యదేవతగా చూస్తున్నారు.
తాజాగా జాన్వి కపూర్ ముంబైలోని రెగ్యులర్ గా వెళ్లే జిమ్ కి వెళ్తున్నారు..ఆ సమయంలో ఓ ఫోటో గ్రాఫర్ ఈ అమ్మడు అందాలను షూట్ చేశారు. జాన్వీ కపూర్ అందానికి లక్షల మంది ఫిదా అయిపోతున్నారు. ఆమెను ఆరాధ్యదేవతగా చూస్తున్నారు. ఆమె హీరోయిన్ గా రాబోతున్న సినిమాపై అంచనాలను కూడా పెంచుతున్నాయి. ప్రస్తుతం జాన్వికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.