స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భాగమతి. ఈ సినిమా ముందు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసినా పవన్ అజ్ఞాతవాసి, బాలయ్య జై సింహాలకు పోటీ ఎందుకని ఆ సినిమాను జనవరి 26కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఊరించిన సినిమాలన్ని నిరాశ పరుస్తుంటే సంక్రాంతి సందడి లేకుండానే ముగుస్తుందా అనిపిస్తుంది. పవన్ అజ్ఞాతవాసి అంచనాలను అందుకోలేకపోయింది.  


బాలకృష్ణ జై సింహా కేవలం మాస్ ఆడియెన్స్ కోసమే అన్నట్టు ఉంది. సెంటిమెంట్ పాళ్లు ఎక్కువ ఉన్నా సరే వీరరసం కాస్త ఎక్కువయినట్టు అనిపిస్తుంది. ఇక సూర్య గ్యాంగ్ కూడా అరవ వాసన ఎక్కువ రావడంతో సోసోగానే నడిపిస్తున్నారు. ఇక రేపు ఆదివారం రాజ్ తరుణ్ రంగులరాట్నం కూడా వస్తుంది. అయితే అది హిట్ అయినా దానికి లాభం వస్తుందేమో కాని ఈ సినిమాలకు పెద్ద రిస్క్ ఏమి లేదు.


ఫైనల్ గా ఈ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకుని వెనుకడుగేసిన భాగమతి సినిమా వచ్చి ఉంటే బాగుండేదని అందరు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. అరుంధతి సినిమాలా సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న భాగమతితో అనుష్క మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేస్తుందని అంటున్నారు. 


యువి క్రియేషన్స్ బ్యానర్లో అనుష్క వస్తున్న భాగమతి సినిమా అంచనాలను అందుకుంటే పెద్ద హిట్ అవడం ఖాయమని తెలుస్తుంది. అయితే జనవరి 26న రవితేజ టచ్ చేసి చూడు సినిమా వస్తుంది. రాబోయే రెండు సినిమాలు హిట్ టాక్ వస్తే సంకాంతి సినిమాలు సైడ్ తప్పుకునే అవకాశం ఉంటుంది. మరి భాగమతి ఏం చేస్తుందో ఏమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: