తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. విలన్, హీరో, కమెడియన్ గా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గాయత్రి. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎనర్జీ అప్పటికి ఇప్పటికి అలానే ఉంది. కొంతకాలంగా లీడ్ రోల్ కి దూరంగా వుంటున్న మోహన్ బాబు ఇప్పుడు మరోసారి కలెక్షన్ కింగ్ అని నిరూపించుకోవడానికి వచ్చేస్తున్నాడు. మోహన్ బాబు చివరగా 'రౌడీ' అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు ఆ తర్వాత మామ మంచు అల్లుడు కంచులో కీలకమైన పాత్రలో కనిపించాక మళ్ళీ తెరమీదకి రాలేదు.
తాజాగా ‘గాయత్రి’ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. రామాయణంలోనే రాముడికి రావణాసురుడికి గొడవ.. మాహాభారతంలో పాండవులకి, కౌరవులకి మాత్రమే గొడవ.. వాళ్లు వాళ్లు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోతే బాగుండేది. కాని వాళ్ల మూలంగా జరిగిన ఆ యుద్ధంలో లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే’.. అక్కడ వాళ్లు దేవుళ్లైతే.. నేనూ దేవుడ్నే.. అర్థం చేసుకుంటారో.. అపార్థం చేసుకుంటారో చాయిస్ ఈజ్ యువర్స్ అంటూ తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో మోహన్ బాబు అదరగొట్టారు.
ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం అందరికి ఇంట్రస్టింగ్ గా వుంది. పెళ్లైన కొత్తలో' ఫేమ్ మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నిఖిల నటిస్తుంది. మంచు విష్ణు, శ్రేయ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.