సినీ ఇండస్ట్రీ లో హీరో యిన్ లకూ అవకాశాలు ఉంటె వారు రాణిలా బతకొచ్చు. అదే వారికి అవకాశాలు తగ్గిపోతే వారిని ఎంతకైనా దిగజారుస్తుంది. బ్రతుకు పైన కంపరం పుడుతుంది. ‘ఆడి పొన్ అవణి’ తమిళ సినిమా హీరోయిన్ శ్రుతి మరో బిజినెస్ ఎంచుకుంది.సినీరంగంలో అవకాశాలు తగ్గడంతో ఫేస్ బుక్ ను నమ్ముకుంది.పొద్దున్న బస్టాప్ లో కనపడ్డ అమ్మాయి పేరు తెలిస్తేనే ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్న ఈ రోజుల్లో ఇక హీరోయిన్ శ్రుతి ఫోటో కనపడితే ఊకుంటారా…..ప్లీజ్ నా ఫ్రెండ్ రిక్వెస్ట్ కన్ఫాం చేయండని పర్సనల్ గా మెసేజ్ చేస్తారు కదా…ఇక్కడ కూడా అదే జరిగింది.
వారిలో మాంచి సౌండ్ పార్టీ అనిపించిన అబ్బాయిలందరితో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది హీరోయిన్. మెల్లమెల్లగా ఫోన్లో మాట్లాడటం,పర్సనల్ గా కలవడం,పార్టీలు చేసుకోవడం ఇలా మొదలుపెట్టి వారి దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు గుంజడం పనిగా పెట్టుకుందట.ఆమె చేస్తున్న ఈ ఘనకార్యానికి తల్లి,సోదరుడి నుంచి ఫుల్ సపోర్ట్ అందేదట.వారు దగ్గరుండి ఎంకరేజ్ చేస్తూ మంచి ధనవంతులైన యువకులను టార్గెట్ చేస్తూ వారి దగ్గర నుంచి ఎలాడబ్బులు గుంజాలనే దానిపై ప్లాన్ వేసి వర్కవుట్ అయ్యేలా సహకారం అందిస్తారట.
ఇక డబ్బులు గుంజినంత సేపు ఆడింది ఆట,పాడింది పాట,డబ్బు చేతుల్లో పడిన తర్వాత అక్కడితో కట్ చేయడం,మరోకొత్త కుర్రాణ్ని ఎంచుకోవడం మళ్లీ మోసం చేయడం ఇదే ఆమె పనిగా పెట్టుకుంది.ఇక మోసపోయామని తెలుసుకున్న యువకులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఆమె భాగోతం బట్టబయలైంది.ఆమె బాధితులు ఒక్కొరొక్కరుగా బయటికి వస్తున్నారు.
వారిలో 50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా పోగొట్టుకున్నోళ్లు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్న సమాచారం.ఫైనల్ గా హీరోయిన్ శృతితో పాటు ఆమె తల్లిని,సోదరుడిని అరెప్టు చేసారు పోలీసులు.ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందని అడిగితే శృతి చెప్పింది ఇదే..నాకు సినిమాల్లో అవకాశాలు లేనందునే డబ్బున్న కుర్రాళ్లను మోసం చేయాలని నిర్ణయించుకున్నానని,తద్వారా డబ్బులు సంపాదించేందుకు అలా చేశానని చెప్పింది.