కత్తి మహేష్ ఒక సినీ విమర్శకుడు,బిగ్ బాస్ కార్యక్రమంలో ఒక పోటీదారుడు.ఇది ఒకప్పటి మాట.కత్తి మహేష్ పవన్ కల్యాణ్ విమర్శకుడు.ఇది ఇప్పటి మాట .బిగ్ బాస్ తదనంతరం ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అసలు పవన్ కల్యాణ్ నటుడే కాదు ,నటుడని ఎవరన్నారు?అసలు అతనికి నటించడమే రాదు అని విమర్శించాడు.దాని పర్యావసానం ఎలా ఉంటుందో అని ఊహించాడో లేదో కాని పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఊహించిన దానికంటే పదింతలు,కాదు కాదు అసలు ఊహించని విధంగా కత్తి  మహేష్ ను బెంబేలెత్తించారు.


పవన్ ను విమర్శించిన కొన్ని గంటల్లోపే కత్తి ఫొన్ నంబర్ వాట్సాప్ మరియు ఇతరత్రా సామజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవడంతో పగలు,రాత్రి  తేడా లేకుండా ఫొన్ ,మెసేజ్ లు చేసి కంటిమీద కునుకులేకుండా చేసారు .అప్పటినుండి కత్తి మహేష్ ,పవన్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది .కత్తి మహేష్ పవన్ ను ఏదో ఒకటి అనడం ,ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినడం ,దానికి కత్తిని ఉద్దేశించి సోషల్ మీడియా లో కించపరచడం ఇలా గత 3 నెలల నుండి హాట్ టాపిక్ అయింది.తాజాగా పవన్ కు మద్దతు తెలుపుతూ కత్తిని కించపరచిన నటి పూనమ్ కౌర్ పైన కూడా కత్తి మహేష్ బురద జల్లడంతో ఆమె విలవిల్లాడిపోయింది.


ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అసలు ఉంటుందా అని అనుకొనేలోపు కోనవెంకట్ జోక్యం చేసుకొని జనవరి 15 వరకు సైలెంట్ గా ఉండమనడంతోవివాదం కొద్దిగా సర్దుమనిగింది .కానీ కత్తి మహేష్ నిన్న      చేసిన ట్వీట్ మళ్ళీ రచ్చలేపుతుంది.కత్తి మహేష్ సంక్రాంతి పండుగ నిమిత్తం తన సొంతవూరైన పీలేరు కు వెళ్తున్న దారి మధ్యలో రెండు బైక్ లలోని యువకులు జై పవన్ కల్యాణ్ అంటూ తన కారును వెంబడించారని ,అక్కడికి వెళ్ళాక రాష్ట్రంలోని విజయవాడ, తిరుపతి, మదనపల్లి నుండి యువకుల పీలేరు కు వచ్చి విచారించివెళ్లినట్లు ఆయన తన ట్వీటులో రాసుకొచ్చాడు.దీన్ని బట్టి చూస్తే కత్తికి అక్కడ అభిమానులు ముహూర్తం పెట్టారేమోని ,పండగ అయిపోయే వరకు సురక్షితంగా అక్కడనుండి వస్తాడో రాడో అని  నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: