అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ గురించి ఆ మూవీ బయ్యర్లు టెన్షన్ పడుతూ ఉంటే ఆమూవీ ఫెయిల్యూర్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు వరంగా మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’ ఎఫెక్ట్ తో జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న లేటెస్ట్ మూవీ చాల మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది.

DEVI SRI PRASAD LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

జూనియర్ అడగకపోయినా త్రివిక్రమ్ ఈసినిమా గురించి తాను వ్రాసిన స్క్రీన్ ప్లే విషయమై మరొకసారి తన రైటర్స్ టీమ్ తో కూర్చుని చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఈసినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణుల విషయంలో కూడ మార్పులు జరిగే అవకాసం ఉంది అని అంటున్నారు.

 ANIRUDH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇందులో భాగంగా మొట్టమొదటగా అనిరుధ్  పై వేటుపడే అవకాసం ఉంది అని అంటున్నారు. ఈసినిమా ప్రారంభానికి జరిగిన పూజా కార్యక్రమాలకు అనిరుధ్ కూడ రావడంతో అతడే ఈమూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అన్న భావన వచ్చింది. అయితే ‘అజ్ఞాతవాసి’ సినిమా సంగీతంలో మరీ క్లాసికల్ టచ్ కనిపించింది అన్న కామెంట్స్ జూనియర్ త్రివిక్రమ్ తో చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

వాస్తవానికి త్రివిక్రమ్ సూచనలు మేరకే అనిరుధ్ అలాంటి కంపోజిషన్స్ ఇచ్చి ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతూ ఉన్నా జూనియర్ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండాలి అనిరుధ్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఉంటే బాగుంటుంది అన్న సూచనలు జూనియర్ నుండి త్రివిక్రమ్ కు వెళ్ళాయి అన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో అనిరుధ్ స్థానంలో దేవిశ్రీ ఎంపిక ఖాయం అని అంటున్నారు. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలకు దేవిశ్రీని పక్కకు పెడుతున్న పరిస్థుతులలో ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ దేవిశ్రీకి ఊహించని వరంగా మారింది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: