బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా దాదాపు కన్ఫాం అయ్యింది. చరణ్, ఎన్.టి.ఆర్ క్రేజీ మల్టీస్టారర్ గా ఈ సినిమా వస్తుంది. అక్టోబర్ లో మొదలవుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలిసిందే. చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఈ సినిమాలో బాక్సర్స్ గా కనిపిస్తారట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ గా ఇద్దరూ ఇద్దరే అని పెట్టబోతున్నారట.


ప్రస్తుతం చరణ్ రంగస్థలం రిలీజ్ కు వెయిట్ చేస్తుండగా.. బోయపాటి శ్రీను సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇక తారక్ మాత్రం త్రివిక్రం సినిమాకు రెడీ అవుతున్నాడు. రాజమౌళి సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. అయితే ఇద్దరూ ఇద్దరే సినిమా టైటిల్ తో అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగార్జున, ఏయన్నార్ కలిసి నటించారు.


ఆ టైటిల్ నే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు పెట్టబోతున్నారట. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు కథ అందిస్తుండగా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయ్యిందట. ఎన్.టి.ఆర్, చరణ్ మల్టీస్టారర్ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.  రాజమౌళి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుండి మొదలవుతుందని తెలుస్తుండగా.. 2019 సమ్మర్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ క్రేజీ కాంబో ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. అంచనలాను అందుకుంటే కనుక ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ టాలీవుడ్ లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తారని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: