అందరిఅంచనాలను తలక్రిందులు చేస్తూ ఈసంవత్సరం సంక్రాంతి రేసులో బాలకృష్ణ విన్నర్ గా మారాడు అన్నస్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈసారి సంక్రాంతి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏమాత్రం మేలుచేయలేదు అని కామెంట్స్ వస్తున్నా ఇలాంటి వ్యతిరేక పరిస్థుతులలో కూడా బాలకృష్ణ ‘జై సింహా’ కు కలక్షన్స్ పర్వాలేదనిపించుకోవడం సంచలనంగా మారింది.

 BALAKRISHNA JAISIMHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈఏడాది సంక్రాంతికి వచ్చిన నాలుగుసినిమాల్లో ‘అజ్ఞాతవాసి’ అవుట్ రైట్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా సూర్య ‘గ్యాంగ్’ అందరిని మెప్పించలేక ఇబ్బందిపడుతోంది. ఇక రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ స్లో నెరేషన్ వల్ల టాక్ పాజిటివ్ గా తెచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో బాలకృష్ణ ‘జై సింహా’ కు కూడా ఏమంత గొప్పగా టాక్ లేకపోయినా మాస్ ప్రేక్షకులకు దీన్ని మించిన బెటర్ ఆప్షన్ లేదు కాబట్టి ఈసినిమాకే బిసి సెంటర్ల ఓటు వేసారు అని వార్తలు వస్తున్నాయి.

 

ఈసినిమా కథ పాతకాలంనాటి రొటీన్ ఫార్ములాలో కనిపిస్తూ ఉన్నా ఈసినిమా కలక్షన్స్ మరీ అంత తీసికట్టుగా లేవు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజులకు 25 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వస్తే నెట్ కలక్షన్స్ పరంగా 14 కోట్లు ఈమూవీకి వచ్చాయి అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. గతసంవత్సరం వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్థాయిలో లేకున్నా ఈసినిమాకు వచ్చిన డివైడ్ టాక్ ను పరిగణలోకి తీసుకుంటే ఈమూవే కలక్షన్స్ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి అని అంటున్నారు.

 BALAKRISHNA JAISIMHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈరోజుతో సంక్రాంతి ముగిసిపోయినా ఈవారంలో మరే సినిమాలు విడుదలకు లేవుకాబట్టి ఇంచుమించు రిపబ్లిక్ డే వరకు సినిమాలు చూడాలి అని అభిప్రాయపడే ప్రేక్షకులకు ‘జై సింహా’ కు మించిన ఆప్షన్ మరొకటి లేకుండా పోయింది. అదేవిధంగా సంక్రాంతి పండుగ ముగిసినా బిసి సెంటర్లలోని మాస్ ప్రేక్షకులు ఈరోజునుంచి సినిమాలు ఎక్కువగా చూస్తారు కాబట్టి ఎలాచూసుకున్నా నష్టాలు లేకుండా ‘జై సింహా’ గట్టెక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: