పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే అది కాస్త ఫ్లాప్ దారిలో వెళ్లింది. సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా అది కాస్త నిరాశ పరచే సరికి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇక ఈ సినిమా హిట్ అయితే ఫెస్టివల్ ట్రీట్ గా విక్టరీ వెంకటేష్ సీన్స్ యాడ్ చేయాలని చూశారు. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో సినిమా నుండి 12 నిమిషాలు కట్ చేసి వెంకటేష్ తో 7 నిమిషాల సీన్ యాడ్ చేశారు.


సంక్రాంతి నుండి అని చెప్పినా భోగి నుండి ఆ సీన్స్ వస్తున్నాయి. అయితే వెంకటేష్ వచ్చినా సరే అజ్ఞాతవాసికి జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయిందని అంటున్నారు. సినిమాలో వెంకటేష్, పవన్ సీన్స్ కూడా గణేష్, గబ్బర్ సింగ్ డైలాగ్స్ తో నడిచిందని అది కూడా కామెడీ అనిపించడంతో ఆడియెన్స్ కు కనెక్ట్ అవలేదని అంటున్నారు.


గణేష్ సినిమాలోని వెంకటేష్ సీన్, గబ్బర్ సింగ్ లోని పవన్ కళ్యాణ్ సీన్ వస్తుందట. ఇక పవన్ కళ్యాణ్ ను వెంకటేష్ కూడా పవర్ స్టార్ అని సంభోదించడం బాగుందట. అయితే ఈ సీన్స్ రిలీజ్ నుండి ఉంటే సినిమాకు కాస్త హెల్ప్ అయ్యేవేమో కాని ఇప్పుడు ఈ సినిమాను వెంకటేష్ కూడా కాపాడలేదని అంటున్నారు.


భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. త్రివిక్రం నుండి ఇలాంటి సినిమా కూడా వస్తుందా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెడుతుందని టాక్. మరి అసలు సినిమా వసూళ్ల లెక్క ఎలా ఉంది. ఎంత నష్టాలను తెచ్చింది అన్నది కలక్షన్స్ రిపోర్ట్ వస్తేనే కాని చెప్పలేం.



మరింత సమాచారం తెలుసుకోండి: