టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. ‘చిరుత’ సినిమాతో ఆయన తనయుడు రాంచరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా..ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఎన్నో రికార్డులు కూడా సృష్టించారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో వరుస విజయాలు అందుకున్న రాంచరణ్ కెరీర్ పరంగా ఒకటీ రెండు తప్ప అన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
గత సంవత్సరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ధృవ’తో మంచి విజయం అందుకున్న రాంచరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆ మద్య రిలీజ్ అయ్యింది. ఇక సినిమాలో రాంచరణ్ పాత్ర పై రక రకాలు రూమర్లు వస్తున్నాయి. అంతే కాదు కొన్ని ఫోటోలు కూడా లీక్ కావడం..ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన ఫుటేజ్ డిలీట్ కావడం ఇలా సినిమా పై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా సినిమా షూటింగ్ షర వేగం జరుగుతూనే ఉంది. మార్చిలో ఈ మూవీ విడుదల కానుందని తెలుస్తుండగా, ఇప్పటి వరకు బయటకి వచ్చిన ఫోటోస్ ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నాయి. గత చిత్రాల కంటే ఈ మూవీలో రామ్ చరణ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా చిత్ర టీజర్ విడుదల అవుతుందని ఫ్యాన్స్ భావించగా, మూవీ యూనిట్ పోస్టర్ని విడుదల చేస్తూ టీజర్ టైం ఫిక్స్ చేసింది. సుకుమార్ - రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రంగస్థలం 1985’.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో సమంత కథానాయికగా నటించగా జగపతిబాబు.. ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24న సాయంత్రం 4.15 గంటలకు టీజర్ను విడుదల చేస్తున్నట్లు తెలిపే పోస్టర్ను ట్విట్టర్లో ఉంచారు. టీజర్ విడుదల తేదీ తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మూవీలో రామ్ చరణ్ చిట్టి బాబు అనే పాత్రలో కనిపించనున్నాడు.