మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, 'సెకండ్ షో' అనే చిత్రంలో నటించిన సిద్దు ఆర్ పిళ్లై(27) గోవా బీచ్‌లో సోమవారం శవమై తేలాడు. జనవరి 12న ఆయన గోవాకు వెళ్లారు. అయితే ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోవడం వల్లే చనిపోయినట్టు ప్రత్యక్షంగా చూసిన కొంతమంది చెప్పినట్లు సమాచారం. షూటింగ్ గ్యాప్ దొరకడంతో కాస్త రిలాక్స్ అయ్యేందుకు, ఎంజాయ్ చేయడానికి తన స్నేహితులతో గోవా వచ్చాడని సమాచారం. 
ఎంజాయ్ చేసేందుకు గోవా వచ్చి
కాగా, సోమవారం బీచ్ లో శవంగా కనిపించాడు సిద్ధు.  బీచ్‌లో పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహం తన కొడుకు సిద్ధుదే అని అతడి తల్లి గుర్తించినట్లు మలయాళ మీడియాలో వార్తలొచ్చాయి. సిద్ధు మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సిద్ధూకు స్విమ్మింగ్ వచ్చని, నీటిలో మునిగి చనిపోయే అవకాశం అయితే లేదని సన్నిహితులు అంటున్నారు.
 సెకండ్ షో సినిమా ద్వారా
దీంతో పోలీసులు అతడి మరణానికి కారణాలు ఏమిటనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ తెరంగ్రేట మూవీ ‘సెకండ్ షో' ద్వారానే సిద్ధు కూడా నటుడిగా పరిచయం అయ్యాడు. ఈచిత్రంలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2012లో ఈచిత్రం విడుదలైంది. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోవడం వల్లే చనిపోయినట్టు ప్రత్యక్షంగా చూసిన కొంతమంది చెప్పినట్లు సమాచారం.
హత్యా? ప్రమాదమా?
ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు మలయాళ చిత్ర ప్రముఖులు కూడా సిద్ధ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.సిద్ధు అంత్య క్రియలు సిద్ధు స్వస్థలం అయిన త్రిషూర్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  సిద్ధు హఠాన్మరణంపై మలయాళ హీరో, మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   ‘సిద్ధు ఆర్ పిళ్లై మృతి నన్ను ఎంతగానో బాధించింది. ఆయన కుటుంబానికి అండదండగా ఉంటామని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: