గత నాలుగు నెలలుగా సోషల్ మీడియాలో కనీవినీ ఎరుగని రీతిలో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కి మాటల యుద్దం కొనసాగుతుంది. మొన్నటి వరకు కేవలం ఫ్యాన్స్ వరకే పరితమైన ఈ విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీవారు కూడా జోక్యం చేసుకునే పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్..కత్తిమహేష్ పై చేసిన వ్యాఖ్యలకు మనోడు కూడా భారీ స్థాయిలో కౌంటర్ ఇచ్చారు..ఒకదశలో పూనమ్ ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టండి అంటూ పవన్ కళ్యాన్ కి పూనమ్ ట్విట్ చేయడం మరో వివాదం అయ్యింది.
ఇదిలా ఉంటే..పవన్ - కత్తి మహేష్ వివాదాన్ని పుల్ స్టాప్ పెట్టేందుకు రైటర్ కోన వెంకట్ ప్రయత్నించాడు. కత్తి ప్రెస్ మీట్ అనంతరం ఈనెల 15వరకు వెయిట్ చేయండి. కత్తిమహేష్ గురించి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కానీ, జనసేన అభిమానులు కానీ కామెంట్ చేయోద్దని సూచించాడు. ఇక కత్తిమహేష్ లైవ్ డిబెట్లలో పవన్ గురించి మాట్లాడొద్దని ..అలా చేస్తే వివాదానికి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తానని చిన్న హింట్ ఇచ్చాడు.
అయితే కోన వెంకట్ మాటల ప్రకారం కత్తి మహేష్ నాలుగైదు రోజులుగా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కామ్ గా ఉన్నారు. 16న కత్తి ఏం చేయబోతున్నాడు అనే విషయం పై చర్చకు రాగా ఇదిగో ఇలా ‘‘నేను నాలుగు రోజులు మౌనం వహించేసరికి, మా కుటుంబం మీద దాడులు.
నా పై దాడులు చేయడానికి ప్రయత్నాలు... నన్ను పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండులు. పిచ్చి సేనకు తిక్కసేనానికి మంచి మాటలు నెత్తికెక్కవని అర్థమయింది. ఇక కాళ్ళబేరానికి ఎవరు వస్తారో తేల్చుకుందాం.’’ అన్నారు.