టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల భామ చార్మీకి కొంత కాలంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.  అప్పుడప్పుడ ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారు మతులు పోగొడుతున్న చార్మీ గత సంవత్సం డ్రగ్స్ కేసులో సిట్ ముందు హాజరైన విషయం తెలిసిందే.  ఇక చార్మీ కి ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ ఉందని..ఓ స్టార్ హీరోతో రొమార్స్ చేస్తుందని ఎన్నో రకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.  కానీ వాటన్నింటింని ఖండించింది చార్మీ. 
Image result for charmi hot
‘నీతోడు కావాలి’ తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఛార్మికి వెంటనే కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి.  కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది.

పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం కెరీర్ పరంగా పెద్దగా సినిమాలు లేకపోవడంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది చార్మి.  సినీ నటి చార్మి  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి రోజు తనకు సంబంధించిన విషయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటుంది.

తాజాగా ఆమె తన పెంపుడు చిలుక 'మిట్టూ'తో కలిసి ఒకే కంచంలో అన్నం తింటూ దానితో ఆడుకుంది. దానికి అన్నం తినిపిస్తూ లిప్ కిస్ ఇచ్చింది.  ఇక తన బెస్ట్ ఫ్రెండ్ మిట్టూ అని..తన తో చాలా టైమ్ పాస్ అవుతుందని..అసలు టైమ్ అనేదే తెలియదని అంటుంది చార్మి. మిట్టూతో కలసి లంచ్ చేస్తున్నానంటూ ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: