టాలీవుడ్లో నందమూరి హీరోలకు, మెగా హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద ఉండే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రోజు థియేటర్ల వద్ద ఆయా హీరోల అభిమానులతో పెద్ద పండగ వాతావరణమే ఉంటుంది.
అలాంటిది ఈ రెండు ఫ్యామిలీల హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ వార్ ఇంకెలా ఉంటుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు మ్యాటర్లోకి వెళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం మార్చి 30వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఇక నందమూరి హీరో నందమూరి కళ్యాణ్రామ్ లేటెస్ట్ సినిమా ఎం.ఎల్.ఏ. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. చెర్రీ సినిమాకు కేవలం రెండు రోజుల ముందుగానే ఎం.ఎల్.ఏ సినిమా రిలీజ్ అవుతోంది.
ఇలా రెండు రోజుల తేడాలో నందమూరి హీరో వర్సెస్ మెగా హీరో తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుండడంతో బాక్సాఫీస్ వార్ను హీటెక్కనుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో ? చూడాలి. ఇక ఈ రెండు సినిమాల మధ్యలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మహానటి’ రిలీజవుతూ పోటీని మరింత తీవ్రతరం చేయనుంది.