మంచులక్ష్మి నటిగా నిర్మాతగా కన్నా బుల్లితెర హోస్ట్ గా బాగా రాణించింది. ఈమె బుల్లితెర పై ప్రెజెంట్ చేసే కార్యక్రమాలకు మంచి రేటింగ్స్ కూడ వచ్చాయి. ఆ మధ్య 'మేము సైతం' అంటూ ఒక విభిన్న కార్యక్రమాన్ని మంచులక్ష్మి ప్రెజంట్ చేసింది. ఈ కార్యక్రమానికి కూడ మంచి రేటింగ్స్ వచ్చాయి. ఒక విధంగా ఈ కార్యక్రమం ఛారిటీ షో.
ఈ కార్యక్రమానికి వచ్చిన వారు ఏదోవిధంగా కొంత మొత్తం సేకరిస్తే కొంతమంది బాధితులను ఎంపిక చేసి ఆ మొత్తాన్ని అందించారు. ఈ షో పై చాలా ప్రశంసలు వచ్చి ఈ షో క్లిక్ కావడంతో ఈషో రెండో సీజన్ ను స్టార్ట్ చేయబోతోంది ఒక ప్రముఖ ఛానల్. ఈ షో కు సంబంధించి మొదటి సీజన్ లో చాలా మంది సినిమా సెలబ్రిటీలు పాల్గొన్న విషయం తెలిసిందే.
గతంలో ఈ షోలో పాల్గొన్న సెలెబ్రిటీలు అంతా రకరకాల వ్యాపారాలు ఒక రోజులో చేసి అలా వచ్చిన మొత్తాన్ని షోకి అందించారు. పానీ పూరీ, హాట్ చాట్, కూరగాయలు అమ్మడం, బస్సులో టికెట్స్ అమ్మడం ఇలా చాలారకాల వ్యాపారాలు చేసారు. ఇది ఇలా ఉండగా ఈ షోకి సంబంధించి సెకండ్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. .అయితే ఈసారి ఈ షో సెకండ్ సీజన్ ను నందమూరి బాలకృష్ణతో ప్రారంభం చేయబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మంచు ఫ్యామిలీకి నందమూరి బాలయ్యకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా మంచులక్ష్మి కోరగానే ఈ షోకి అతిథిగా వస్తానని బాలకృష్ణ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య లాంటి టాప్ హీరో ఇలాంటి షోకు రావడం ఒక సంచనలంగా మారింది. అయితే అసలు భేషజం లేకుండా భోళాగా తనకు తోచినది మాట్లాడే బాలకృష్ణ చేత ఈషో కోసం విరాళాలు సేకరించడానికి మంచువారి అమ్మాయి ఏమార్గం ఎంచుకుంటుంది అనే విషయం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏమైనా మంచులక్ష్మి వ్యూహాలకు బాలయ్య ఇరుకున పడినట్లే అనుకోవాలి..