పవన్ కల్యాణ్ అభిమానులు మరియు సినీ విమర్శకుడు కత్తి  మహేష్ ల మధ్య గత 5 నెలల నుండి సోషల్ మీడియాలో జరగుతున్న రచ్చ గురించి తెలిసిందే. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కత్తి మహేష్ మాటల తూటాలను పేల్చడం వాటికి బదులుగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను వాడుకొని కత్తి మీద తమ అస్త్రాలను వాడటం ఇలా గత 5 నెలలనుండి జరగుతున్న తంతు ఇదే. ఈ వివాదానికి  ఇప్పటిలో ఫుల్ స్టాప్ పడేలా లేదు.


పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపేవాళ్ళని కూడా కత్తి మహేష్ వదిలిపెట్టడంలేదు. తన పదునైన కత్తిలాంటి మాటలతోవారిని ఒక ఆటాడేసుకుంటున్నాడు. అందుకు నటి పూనమ్ కౌర్ ఒక నిదర్శనం. సహాయం చేద్దామని వెళ్తే అపకీడు ఎదురైనట్లు,పాపం పవన్ కు మద్దతు తెలుపబోయి పదునైన కత్తితో తనను తాను పొడుచుకుంది. కత్తి పోట్లకు విలవిల్లాడిపోయి, ఆఖరుకి పవన్ గారు నన్ను కాపాడండి అని ట్వీట్ చేసిందంటే ఎంతలా చెడుగుడు ఆడుకున్నాడో ఊహించవచ్చు.


పరిస్థితి ముదురుతున్న సమయంలో కోన వెంకట్ కల్పించుకొని ఈనెల 15 వరకు సైలెంట్ గా ఉండమని కత్తి ని కోరాడు. కాగా ఖమ్మంలో గల ఒక సినిమాహాలులోని పురుషుల మూత్రశాలలోని ఒక యూరిన్ సింక్ కు కత్తి మహేష్ ఫోటో అంటించి తీసిన  వీడియో ఫేసుబుక్ లో వైరల్ అయింది. ఇలా  యూరిన్ సింక్ కు తన ఫోటో అంటించిన విషయం కత్తి దృష్టికి వచ్చింది. ట్విట్టర్ లో సంబంధిత ఫొటోను జోడించి "ఇలాంటి వాటినే పవన్ ఫ్యాన్స్ చేస్తున్నారు. ఒకవేళ నా మౌనాన్ని నా బలహీనంగా తీసుకుంటే, వారి మూర్ఖత్వం ఖచ్చితముగా వారి ఆనందం అవదు " అని పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి స్పందించారు. మరి వీరి వివాదానికి ఫుల్ స్టాప్ పడేది ఎన్నడో.


మరింత సమాచారం తెలుసుకోండి: