చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుడు పాత్రలో కనిపించి మెప్పెంచిన నాటినుంచి నటుడు ప్రభాకర్ కూడ సెలెబ్రిటీగా మారిపోయాడు. ఈమధ్య ఈనటుడికి చాలమంది దర్శకనిర్మాతలు మంచి అవకాశాలు ఇస్తున్నారు. లేటెస్ట్ గా విడుదల అయిన ‘జై సింహా’ లో కూడ ఈ నటుడు నెగిటివ్ షేడ్ తో ఉండే ఒక ప్రధాన పాత్రను పోషించాడు. ఈ నేపధ్యంలో ఈనటుడు ఈమధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
టాలీవుడ్ నట సింహం బాలకృష్ణకు కోపం ఎక్కువని సెట్స్ పై కోపం వస్తే ఎవరినీ లెక్కచేయరని జరిగే రకరకాల ప్రచారాలా పై తాను భయపడిన విషయాన్ని వివరిస్తూ ఈ కామెంట్స్ చేసాడు. ‘జై ససింహా’ షూటింగ్ స్పాట్ లో తాను చూసింది వేరే బాలకృష్ణ అని వివరిస్తూ బాలకృష్ణ తానూ నటించే సందర్భంలో తాను ఎప్పుడు తడబదలేదని ఎదుటివారు తడబడే విధంగా బాలకృష్ణ ప్రవర్తించడని తన తోటినటులను ఎంకరేజ్ చేయడమే కాకుండా చాలా ఫ్రెండ్లీగా బాలయ్య ఉంటాడు అంటూ కామెంట్స్ చేసాడు ప్రభాకర్.
గతంలో ‘మర్యాద రామన్న’ షూటింగ్ జరిగే సమయంలోనే దాసరి డైరెక్షన్లో బాలయ్య అప్పట్లో చేస్తున్న ‘పరమ వీర చక్ర' సినిమాలో ఓ క్యారెక్టర్ చేయమని ఫోన్ వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. అప్పటికే తనకు బాలయ్య గురించి చాలామంది చెప్పిన మాటలు విని ఆసినిమాలో చేయడానికి భయపడి ఆ అవకాశాన్ని వదులుకున్న విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టాడు ప్రభాకర్.
ఇదే సందర్భంలో ప్రభాకర్ మాట్లుడుతూ ‘జై సింహా' సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీన్లో బాలకృష్ణను తాను కొట్టినప్పుడు బాలయ్య గాల్లో ఎగిరిపోతూ ఉంటే తిరిగి తనను బాలకృష్ణ చితక కొడతారని బాలయ్య అభిమానులు ఆశించారని అయితే ఆసీన్ అలా లేకపోవడంతో బాలయ్య అభిమానులు అసహనానికి గురయ్యారు అన్న విషయం తాను ‘జై సింహా’ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసినప్పుడు పసికట్టిన విషయాన్ని బయటపెట్టాడు ప్రభాకర్. దీనితో తాను ‘జై సింహా’ ప్రదర్శిస్తున్న ఆ ధియేటర్ నుండి తనను బాలయ్య అభిమానులు గుర్తు పట్టకుండానే ముందుగానే బయటకు వచ్చి బాలకృష్ణ అభిమానుల అసహనం నుండి తాను తప్పించుకున్నాను అంటూ జోక్ చేసాడు. ‘జై సింహా’ చెప్పుకోతగ్గ సూపర్ హిట్ కాకపోయినా ఈసినిమా వల్ల ప్రభాకర్ కు మరింత ఇమేజ్ పెరిగింది అన్నది వాస్తవం..