టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోల వారసుల హవా నడుస్తుంది. ఇప్పటికే పలు స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకుల వారసులు ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అయ్యారు. ఈ నేపథ్యంలో స్టార్ ప్రోడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీనివాస్ మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో ‘అల్లుడు శీను’ తో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు తమ సత్తా చాటుతున్న సమయంలో బెల్లం కొండ శ్రీనివాస్ డ్యాన్స్, ఫైట్స్ లో తన సత్తా చూపిస్తూ దూసుకు వెళ్తున్నాడు. అంతే కాదు మనోడితో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత యంగ్ హీరో శ్రీనివాస్ సరసన నటించింది.
ఆ తర్వాత స్పీడున్నోడు సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేక పోయింది. దీంతో మరోసారి హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జయ జానకి నాయక’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో అప్ కమింగ్ హీరోయిన్లలో బిజీగా ఉన్న రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఆమెతో పాటు ప్రగ్నాజైస్వాల్ కూడా నటించింది. ఇలా ఈ కుర్ర హీరో వచ్చే రావడమే స్టార్ హీరోయిన్లతో రోమాన్స్ చేస్తున్నాడు.
మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి క్రేజీ హీరోయిన్లతో తన గత సినిమాల్లో కలిసి నటించిన ఈ నిర్మాత తనయుడు ప్రస్తుతం పూజా హెగ్డేతో ‘సాక్ష్యం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యేలోపే ఓంకార్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మరో స్టార్ కథానాయిక కీర్తి సురేష్ నటించే అవకాశముందని తెలిసింది.
ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించిన కీర్తి ఇపుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకట్టబోతోందని సమాచారం. ఈ సినిమా కోసం బెల్లంకొండ ఆమెకు ఏకంగా కోటి 25 లక్షలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.హీరోయిన్లకు భారీ పారితోషికాలు చెల్లించడం బెల్లంకొండకు కొత్త విషయమేమీ కాదు. ఆయన అనుకున్నట్లుగా కీర్తిని హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్ష్యం సినిమా షూటింగ్ పూర్తవగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.