పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా అంటే ఆ అంచనాల లెక్క వేరేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్లాపుల చెర నుండి విడిపిస్తాడు అనుకున్న అభిమానుల ఆశలను అడి ఆశలు చేశాడు త్రివిక్రం. అయితే జనవరి 10న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా ఇంత డిజాస్టర్ అవడానికి కేవలం సగటు ప్రేక్షకుడే కాదు పవన్ అభిమానులు అంటూ కొందరు వాదిస్తున్నారు. 


అదేంటి పవర్ స్టార్ బొమ్మ కనబడితేనే చాలు అనుకునే ఫ్యాన్స్ ఎందుకు ఆయన సినిమాను హిట్ చేయరు అంటే.. పవర్ స్టార్ బాబి డైరక్షన్ లో ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా నిరాశ పరచింది. అది అభిమానులు అంత పెద్దగా కేర్ చేయలేదు. ఇక ఆ తర్వాత కాటమరాయుడు అంటూ మరో సినిమా డీలి డైరక్షన్ లో వచ్చింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయినా సైలెంట్ అయ్యారు.


అయితే ఈసారి త్రివిక్రం తో అజ్ఞాతవాసి అంటూ వస్తున్నారని ఫ్యాన్స్ అజ్ఞాతవాసిపై అంచనాలు తారాస్థాయిలో పెట్టుకున్నారు. ఆ అంచనాలను అందుకోవడం లో సినిమా విఫలమైంది అందుకే మిడ్ నైట్ 1 నుండి 4 గంటల షోకే సినిమా టాక్ అంతా స్ప్రెడ్ అయ్యింది. పవన్ మీద గుండెల నిండా అభిమానం ఉన్నా సినిమా ఊహించిన రేంజ్ లో లేకపోయే సరికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యింది.


సినిమా కథ కథనాలు ప్రేక్షకులకు చేరువయ్యేలా తీయడంలో త్రివిక్రం ఫెయిల్ అయ్యాడు. పవన్ తన పరంగా తాను సూపర్ అనిపించుకున్నా త్రివిక్రం మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశాడని చెప్పొచ్చు. 125 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన అజ్ఞాతవాసి సినిమా ఇప్పటిదాకా 55 నుండి 60 కోట్లు మాత్రమే సంపాదించగలిగింది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎంత లాస్ తెస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: