బాహుబలి వంటి హిట్ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క స్త్రైట్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా భాగమతి. ఈ సినిమాను  ఈనెల 26న విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునది సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది హారర్ ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ట్రైలర్ లో భయం పుట్టించారు.

బేసిగ్గా ఇలాంటి సినిమాలకు యూ బై ఎ లేదా ఏ సర్టిఫికెట్లు ఇస్తుంటారు. కానీ భాగమతి క్లీన్ యూ రావడం గమనార్హం. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఏమి ప్రేక్షకులను ఆదరించకపోవడం తో ప్రస్తుతం వస్తున్న భాగమతి మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూసి ప్రేక్షకులు బాగమతి సినిమా మరో అరుంధతి అవుతుందని అంటున్నారు.

సినిమా మీద నమ్మకంతో ఏమోగానీ తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం భాషల్లో కుడా ఈ సినిమాని నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్  విడుదల చేస్తుంది. ఒకవేళ ఈ భాగమతి అరుంధతి అయితే ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన మొదటి సినిమా అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: