న్యూ ఇయర్ వేడుకల్లో తప్పతాగి కారు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో యాంకర్ ప్రదీప్ అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో మరో యువతితో కలిసి ప్రదీప్ దొరికిపోయాడు. మోతాదుకు మించి మద్యం సేవించడం బ్రీత్ అనలైజర్లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో యాంకర్ ప్రదీప్పై కేసు నమోదు చేసి.. అతని కారును పోలీసులు సీజ్ చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ప్రదీప్ ఇప్పటికే గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్కు హాజరైన విషయం తెలిసిందే. ఈ కౌన్సిలింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్కు పోలీసుల సూచనలు ఇచ్చారు.
ఇక తాను చేసిన తప్పును మరెవరూ చేయవద్దంటూ ప్రదీప్ ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం విదితమే. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విచారణ నిమిత్తం టీవీ యాంకర్ ప్రదీప్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. తండ్రితో కలిసి ప్రదీప్ ఇవాళ కోర్టుకు వచ్చాడు. మరోవైపు ప్రదీప్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
సాధారణంగా 100లోపు పాయింట్లు వస్తే కారును యజమానులకు అప్పగిస్తారు. ప్రదీప్ అంతకు మించి తాగి దొరికిపోవడంతో కారును అప్పగించే విషయంలో కోర్టు తీర్పే ఫైనల్ కానుంది.