తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ చార్మీ గత కొంత కాలంగా సినిమా చాన్సులు లేక అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ తో దర్శనమిస్తుంది.  ప్రస్తుతం ఈ అమ్మడు నిర్మాణ రంగం వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.   ఆ మద్య డ్రగ్స్ కేసులో చిక్కుకున్న చార్మి ప్రస్తుతం రిలీఫ్ గా ఉన్నట్లు తెలుస్తుంది.  సాధారణంగా సెలబ్రెటీలకు తమ చుట్టు పకడ్భందీ సిబ్బంది ఉండటం గమనిస్తుంటాం.

అయితే ఒక్కోసారి ఆ సిబ్బంది..ఇబ్బంది నుంచి ఉల్లాసంగా బయటి ప్రపంచంలో ఎవ్వరూ లేకుండా ఒంటరిగా గడపాలని చూస్తుంటారు.  అయితే ఇలాంటి సమయాల్లో సెలబ్రెటీలు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొవలసి వస్తుంది.  అందుకే వారికి సాధ్యమైనంత వరకు సెక్యూరిటీ ఉంటుంది. తాజాగా సినీ రంగంలో తన అందచందాలతో కుర్రకారుని ఉర్రూతలూగించిని హాట్ బ్యూటీ చార్మీ సరదాగా ఓ కోరిక కలిగిందట.

హైదరాబాద్ వీధుల్లో బైక్‌పై చెక్కర్లు కొట్టాలని.. అనుకున్నదే తడవుగా ఎవరూ గుర్తు పట్టకుండా ఫేస్‌ను కవర్ చేసుకుని బైక్‌పై రైడ్ చేసింది. ప్రస్తుతం ఛార్మి పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న మెహబూబా సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తోంది. హైదరాబాద్‌లో మెహబూబా షూటింగ్ ముగిసిన అనంతరం రాత్రి సమయంలో బైక్‌పై హైదరాబాద్ వీధులన్నీ చుట్టేసేందుకు ప్లాన్ చేసింది.
Image result for charmi hot
వెంటనే మెహబూబా కో-ఆర్డినేటర్ శ్రీధర్‌తో కలిసి బైక్‌పై తనను గుర్తు పట్టకుండా ఫేస్‌ను కవర్ చేసుకుని బయల్దేరింది. వీరిద్దరూ మధ్యలో స్ట్రీట్ ఫుడ్ కోసం ఓ బండి దగ్గర ఆగినపుడు.. అక్కడ తన సీక్రెట్ జాయ్ రైడ్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘హైదరాబాద్ వీధుల్లో బైక్ రైడ్.. విత్ శ్రీధర్’ అని ట్వీట్ చేసింది.  ఏదో సినిమా వాళ్లు గొప్ప అనుకుంటారు గానీ, వారికి కనీసం స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండదు పాపం. 

మరింత సమాచారం తెలుసుకోండి: