గత సంవత్సరం ‘ధృవ’ సినిమాతో మంచి విజయం అందుకున్న మెగా అబ్బాయి రాంచరణ్  ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ లో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.  వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలం అయ్యింది..కానీ ఎప్పటికప్పుడు రక రకాల ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి.   అయితే సుకుమార్ .. చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది.  
Related image
వాస్తవానికి  రంగస్థలం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాల రీత్యా విడుదల ఆలస్యమైంది.  'రంగస్థలం' చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుందనుకున్న సమమయంలో సుకుమార్ రీ షూట్ పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ ప్రతీ సీన్ పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటాడనే సంగతి తెలిసిందే. రంగస్థలం మూవీలో కొన్ని సీన్లు ఆశించిన స్థాయిలో రాలేదని.. అందుకే రాజమండ్రి పరిసరాల్లో మళ్లీ షూటింగ్ చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
Image result for rangasthalam
‘గోదావరి జిల్లాల్లో చేయాల్సిన సీన్లను హైదరాబాద్‌లో సెట్ వేసి షూట్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఔట్‌పుట్ రాలేదు. దీంతో రీషూట్ చేస్తున్నారు. ఇందుకోసం చెర్రీ డేట్స్ కూడా ఇచ్చాడు’ అని ప్రచారం జరుగుతోంది.  1985 కాలం నాటి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
Related image
ఆది పినిశెట్టి, జగపతి బాబు, యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఇక రీ షూటింగ్‌ను ఈ నెల చివరిలోపు పూర్తి చేసి.. చెర్రీ వచ్చేనెలలో బోయపాటి సినిమా షూటింగులో పాల్గొంటారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: