పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందు రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను సినిమా ప్రియులను తీవ్ర నిరాశ పరిచింది. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కాబట్టి సినిమా హిట్టవుతుందనే భావనతో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆశించారు తీరా సినిమా ఫలితం చూస్తే సినిమా పడిన మొదటి షోతోనే అట్టర్ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే ఈ క్రమంలో డిస్టిబ్యూటర్లు కూడా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా అని భారి మొత్తం చెల్లించి సినిమా కొనడం జరిగింది. అయితే సినిమా ఫ్లాప్ అవడంతో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు కు యాభై శాతం పైగానే నష్టాలని మిగిల్చే అవకాశం గట్టిగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో అజ్ఞాతవాసి సినిమా నిర్మాత తన వంతుగా 15 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారట, అలానే త్రివిక్రమ్ కూడా కొంత మొత్తం తిరిగి ఇవ్వడానికి ముందుకొచ్చారని అయితే హీరో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు సాయం అందించడానికి ముందుకు వస్తే బాగుంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: