దర్శకుడుగా తన మొట్టమొదటి సినిమాతోనే టాలీవుడ్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డి తన ‘అర్జున్ రెడ్డి’ ప్రయోగంతో ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈమూవీ ఘన విజయంతో చాలామంది టాప్ హీరోలు సందీప్ రెడ్డి వైపు చూస్తున్నారు అన్న వార్తలు వచ్చాయి.

 SANDEEP REDDY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈ నేపధ్యంలో కొంతకాలం క్రితం సందీప్ రెడ్డి మహేష్ ను కలిసి ఒక మంచి కథ చెప్పాడని ఆకథ మహేష్ కు బాగా నచ్చింది అన్న ప్రచారం కూడ జరిగింది. అయితే ఆతరువాత సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసే పనిలో బిజీ అయిపోయాడు.

SANDEEP REDDY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈమూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో మహేష్ భార్య నమ్రత చొరవతో మహేష్ సందీప్ రెడ్డిల మధ్య లేటెస్ట్ గా ఒక సమావేశం మళ్ళీ జరిగిందని ఆ మీటింగ్ లో మహేష్ సందీప్ ల మధ్య ఒక డీల్ కుదిరింది అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

 MAHESH ALONG WITH SANDEEP REDDY PHOTOS కోసం చిత్ర ఫలితం

తెలుస్తున్న సమాచారం మేరకు సందీప్ రెడ్డి బాలీవుడ్ లో తీస్తున్న అర్జున్ రెడ్డి రీమేక్ ముగిసిన వెంటనే తెలుగులో మహేష్ సందీప్ రెడ్డిల కాంబినేషన్ లో మూవీ పట్టాలు ఎక్కుతుంది అని అంటున్నారు. ఈలోపున మహేష్ వంశీ పైడి పల్లితో తాను కమిట్ అయిన తన మూవీని ఈ ఏడాది దసరాలోపు పూర్తి చేసి ఆతరువాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సందీప్ రెడ్డి మూవీని మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ అయ్యేలా సందీప్ రెడ్డి మహేష్ ల కాంబినేషన్ మూవీ యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేసినట్లు టాక్. ఇప్పుడు ఈ డీల్ కు సంబంధించిన వార్తలు హాట్ న్యూస్ గా మారాయి. మరి ఈ వార్తలలో ఎన్ని నిజాలు అన్నది మరి కొంత కాలం తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు..    

 


మరింత సమాచారం తెలుసుకోండి: