బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తుంది. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ క్యారక్టర్ పై కన్ ఫ్యూజన్ ఏర్పడింది.


కొన్నాళ్లుగా సాహో సినిమాలో ప్రభాస్ పోలీస్ గా నటిస్తాడని వార్తలు రాగా.. ఇప్పుడు దొంగగా కనిపిస్తాడని టాక్. ఇంతకీ ప్రభాస్ పోలీసా.. దొంగనా అన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో ప్రభాస్ పోలీస్ అన్నది తెలుస్తున్నా అది దొంగా.. పోలీస్ అన్నది లేటెస్ట్ టాక్. మొత్తానికి ఈ కన్ ఫ్యూజన్ కు తెర పడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. 


బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెంచేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. రన్ రాజా రన్ తో డైరక్టర్ గా తన సత్తా చాటుకున్న సుజిత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హింది భాషల్లో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది.


ప్రస్తుతం దుబాయ్ షెడ్యూల్ కు సిద్ధమవుతున్న సాహో టీం అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్ కు ప్లాన్ చేశారట. హాలీవుడ్ రేంజ్ సినిమాగా తెరకెక్కుతున్న సాహో సినిమా ప్రభాస్ రేంజ్ మరింత పెంచేలా చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: