హైపర్ ఆది జబర్దస్త్ తో అతి తక్కువ సమయం లో మంచి పాపులారిటీ ని సంపాదించాడు. తన కు మాత్రమే సాధ్యమైన పంచ్ డైలాగ్స్ తో బుల్లి తెర ప్రేక్షకలకు మంచి వినోదాన్ని పంచుతున్నాడు. అయితే హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని అందరికి తెలిసిన విషయమే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శ‌లు సంధించ‌డంతో ఆగ్ర‌హానికి గురైన హైప‌ర్ ఆది, గ‌తంలో క‌త్తిపై విరుచుకుప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

Image result for hyper aadi

ఇక ఆ వివాదానికి ఫుల్ స్టాప్ ప‌డ‌టంతో జ‌బ‌ర్ధ‌స్త్ ఆది ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. ప‌వ‌న్ అభిమానులు సంయ‌మ‌నం పాటించాల‌ని,క‌త్తి మ‌హేష్ పై స్పందిచొద్ద‌ని తెలిపాడు.ఇక‌మీద‌ట మ‌న అభిమాన న‌టుడుప‌వ‌న్ క‌ళ్యాణ్ను హీరోగా చూడొద్ద‌ని,హీరో అన్న విష‌యాన్ని మ‌రిచిపోయి కేవ‌లం నాయ‌కుడిగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు.రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు వంద మంది వంద ర‌కాలుగా మాట్లాడ‌తార‌ని,వారందరికీ స‌మాధానాలు ఇస్తూ పోతే మ‌న‌కే న‌ష్టం వాటిల్లుతుంద‌ని ట్వీట్ చేసాడు ఆది.

Image result for hyper aadi

ఇక త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు.తాను బీటెక్ అయిపోయాక సాఫ్ట్ వేర్ జాబ్ కోసం హైద‌రాబాద్ లో అడుగుపెట్టాన‌ని చెప్పాడు.అనుకోకుండా అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్ ను స్పూప్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ చేయ‌డంతో,దాన్ని చూసిన‌ జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ అదిరే అభి స్క్రిప్ట్ రైట‌ర్ గా అవ‌కాశం ఇవ్వ‌డంతో జ‌బ‌ర్ధ‌స్త్ లో క‌మెడియ‌న్ గా స్థిర‌ప‌డ్డాన‌ని చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: