కొన్ని నెలల క్రితం మీడియాలో ఛార్మీ పూరి జగన్నాథ్ ల స్నేహం గురించి చాల గాసిప్పులు హడావిడి చేస్తూ కనిపించేవి. అయితే ఆతరువాత వీరిద్దరి పేర్లు డ్రగ్స్ వ్యవహారంలో వినిపించి హడావిడి చేయడంతో ఆతరువాత వీరిద్దరి సాన్నిహిత్యం పై వార్తల హడావిడి బాగా తగ్గిపోయింది.

 puri jagannath along with charmee photos కోసం చిత్ర ఫలితం

దీనికితోడు చార్మి ప్రస్తుతం నటిగా సినిమాలు చేయడం తగ్గించేసి పూరి జగన్నాథ్‌ తో కలిసి నిర్మాణ రంగంలో బిజి అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మింపబడుతున్న 'మెహబూబా' మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది.

  ‘మెహబూబా'

ఈమూవీలో పూరి కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించి ఈమూవీ యూనిట్ అంతా కలిసి ఒక పార్టీ చేసుకున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది. పూరి జగన్నాథ్, చార్మితో పాటు హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ నేహా శెట్టి ‘మెహబూబా' టీమ్ అంతా కలిసి ఈ పార్టీలో తెగ ఎంజాయ్ చేసారు.

 అందరిలోనూ ఆసక్తి

ఈపార్టీలో ఛార్మితో పాటు పూరి ఇతర యూనిట్ సభ్యులు డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేసిన ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో ఒక లవ్ స్టోరీగా ఈసినిమాను పూరీ తీస్తున్నాడు. ఈమధ్య కాలంలో పూరీ జగన్నాథ్ తీస్తున్న సినిమాలు అన్నీ వరస పరాజయాలుగా మారుతున్న నేపధ్యంలో కనీసం తన కొడుకు ఆకాష్ ద్వారా అయినా తిరిగి ట్రాక్ లోకి రావాలని పూరీ ఈసినిమా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: