కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ గొడవకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తనపై దుర్భాషలాడుతూ.. తనని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేశ్రాని మూడు నాలుగు నెలల నుండి కత్తి మహేష్ ఏకంగా పవన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వ్యవహారం మరింత ముదరడంతో పాటుగా గొడవ పర్సనల్ విషయాల మీద కూడా వెళ్లడంతో అందరు షాక్ అయ్యారు.


ఇక రీసెంట్ గా కత్తిపై పవ ఫ్యాన్స్ గుడ్ల దాడి చేయడం ఆ తర్వాత కేసు పెట్టడం.. ఫైనల్ గా కత్తి తన కేసు వాపసు తీసుకోవడంతో పాటుగా వారి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. జనసేన పార్టీ నుండి ఓ లేఖ వచ్చిన తర్వాతే కత్తి వెనక్కి తగ్గడం జరిగింది. అయితే కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ గొడవ ఇంత సడెన్ గా ముగింపుకు రావడం వెనుక ఓ స్టార్ హీరో అస్త్రం ఉందని అంటున్నారు.


కొద్దిరోజులుగా కత్తి, పవన్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఎపిసోడ్ అంతా గమనిస్తున్న స్టార్ హీరో కత్తి మరింత పదునెక్కడం చూసి తాను ఇన్వాల్వ్ అయ్యాడట. అయితే డైరెక్ట్ గా కాకుండా ఏపి మంత్రితో కలిసి ఈ గొడవకు పరిష్కారం చేశారని ఇన్నర్ టాక్. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కాని కత్తి పవన్ ఫ్యాన్స్ రచ్చ ఆగినందుకు సగటు ప్రేక్షకుడు మాత్రం హమ్మయ్య అనుకుంటున్నాడు.


గత మూడు నాలుగు నెలలుగా టివి పెడితే కత్తి పవన్ ఫ్యాన్స్ రచ్చే ఉండేది. న్యూస్ అండ్ న్యూసెన్స్ రెండూ ఇదే అన్నట్టుగా న్యూస్ చానెల్స్ అన్ని ఒకరి తర్వాత ఒకరు స్టూడియోలకు పిలిచి చర్చా వేదికలు జరిపారు. ఫైనల్ గా వివాదం ముగిసింది. కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేసి అదే రోజు రెస్టారెంట్ లో డిన్నర్ కూడా చేశారని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: