ఈ సమ్మర్ లో మహేష్ వర్సెస్ బన్ని ఫైట్ తప్పదు అనుకున్న తరుణంలో ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇద్దరు హీరోల సినిమా నిర్మాతలు ఒక కాంప్రమైజ్ కు వచ్చినట్టు తెలుస్తుంది. మహేష్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను (వర్కింగ్ టైటిల్).. అల్లు అర్జున్ వక్కతం వంశీ కాంబోలో వస్తున్న నా పేరు సూర్య. 


ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 27న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాయి. అయితే ముందు బన్ని సినిమా ఎనౌన్స్ చేయడంతో మహేష్ తో ఫైట్ తప్పదని అన్నారు. కాని ఎట్టకేలకు ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య చర్చలు సఫలం అయినట్టు తెలుస్తుంది. మెగా క్యాంప్ కు సన్నిహితుడైన డివివి దానయ్య నిర్మిస్తున్న మహేష్ సినిమా అనుకున్న విధంగానే ఏప్రిల్ 27న రిలీజ్ అవుతుందని అంటున్నారు.


ఇక పోటీలో ఉన్న బన్ని నా పేరు సూర్య ప్రీ పోన్ అయ్యి ఏప్రిల్ 13న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. మొత్తానికి మహేష్, బన్ని కాంప్రమైజ్ ఇండస్ట్రీకి మంచే చేస్తుందని చెప్పొచ్చు. మహేష్ సినిమాలో సిఎం రోల్ చేస్తుండగా శ్రీమంతుడు తర్వాత ఈ కాంబో సెన్సేషన్ క్రియేట్ చేయడం కన్ ఫాం అంటున్నారు.


ఇక బన్ని నా పేరు సూర్య సినిమాలో యాంగ్రీ సోల్జర్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సిని ప్రియులను అలరిస్తుంది. ఒకేరోజు రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఈ సినిమాల మధ్య పోటీ ఉండే అవకాశం లేదు. రెండు వారాల గ్యాప్ ఉన్నా ఎవరికి వారు వసూళ్ళ మీద తమ సత్తా చాటాలని చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: