విలక్షణ పాత్రలు నటించి మెప్పించడంలో హీరో విక్రమ్ కు చాలమంచి పేరు ఉంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడ సినిమాలతో మెప్పించిన ట్రాక్ రికార్డు విక్రమ్ కు ఉంది.  లేటెస్ట్ గా విక్రమ్ నటించిన ‘స్కెచ్’ మూవీ విడుదలై  కోలీవుడ్ లో సక్సస్ సాధించింది.   త్వరలోనే తెలుగులో కూడ అదే పేరుతో ఈ మూవీని రిలీజ్‌ చేయ బోతున్నారని టాక్.    

 HERO VIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈనేపధ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి షాక్ ఇచ్చే ఆలోచనలు బయట పెట్టాడు విక్రమ్. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’ లో నటిస్తున్న విక్రమ్ సుమారు 300 కోట్ల వ్యయంతో  రూపొందబోతున్న ‘మహావీర కర్ణ’ సినిమాలో నటించబోతున్న విషయాన్ని లీక్ చేసాడు.

  బ్రహ్మండంగా నటీనటుల ఎంపిక

అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వింటే ఎవరైనా షాక్ అవుతారు అని అంటున్నాడు విక్రమ్. దీనికితోడు ఈ సినిమాలో ఇండియాలో ఉండే పాపులర్ నటులంతా అందులో నటిస్తారు అంటూ మరో లీకులు ఇస్తున్నాడు విక్రమ్. మహాభారతం అంటే కర్ణుడు, భీష్ముడు, ధుర్యోధనుడు, కుంతి, ద్రౌపది  లాంటి  పాత్రలు కీలకం కావడంతో ఆపాత్రలకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరగబోతోంది అని అంటున్నాడు విక్రమ్.

 HERO VIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

వాస్తవానికి ‘మహావీర్ణ కర్ణ’ సినిమాను తొలుత 100 కోట్లవ్యయంతో తీయాలని తాము భావించామని అయితే సినిమా రేంజ్ పెరగడం, సాంకేతిక నిపుణులు, బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను ౩౦౦కోట్ల సినిమాగా మార్చిన విషయాని బయట పెట్టాడు విక్రమ్. ఫిబ్రవరిలో చాలా గ్రాండ్‌గా  ఈమూవీ నిర్మాణం ప్రారంభం అవుతుందని చెపుతూ మహాభారతం కథ ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ ఈ మూవీని ఇంటర్నేషనల్ రేంజ్‌ లోతీసి ఆస్కార్ రేస్ లో నిల బెట్టడం తన ధ్యేయం అని అంటున్నాడు విక్రమ్.  దీనితో విక్రమ్ కలలు నిజం అయితే ఒక విధంగా ఈ ఆలోచనలు రాజమౌళికి  షాక్ అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: