దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఉంటే ఆ చిత్రం సక్సెసే అన్నంత స్థాయికి ఎదిగారాయన. ఆయన ప్రస్తుతం విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామి స్కేయర్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామి స్కేయర్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న దేవీశ్రీప్రసాద్ను కారణం ఏమిటని ప్రశ్నించగా మరింత ఆనందంతో చెప్పడం మొదలెట్టారు.
ఈ మధ్య దక్షిణ భారత నటినటుల సంఘం మలేషియాలో స్టార్స్ క్రికెట్తో పాటు పలు సినీ వినోద కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కాకపోతే పర్ఫామెన్స్ చివరగా ఇచ్చాను. అయితే..ఆ వేదికలో ముందు వరుసన సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటులు కమల్ హాసన్ కూర్చొని ఉన్నారు.
అయితే ఇందులో ఏం పెద్ద విశేషం ఉందని అనుకుంటున్నారా..అవును పెద్ద విశేషమే ఉంది. నా పర్ఫామెన్స్ చూసిన తర్వాత చివర్లో లేచి నిలబడి చప్పట్లతో అభినందించడం మరచిపోలేని అనుభూతి. ఇద్దరు లెజెండ్స్ ఒకేసారి ప్రశంసించడం అరుదైన విషయం కాగా, వారి మధ్య నన్ను కూర్చోబెట్టుకోవడం, అలా ఫోటో తీయిచుకోవడం జీవితంలో మరపురాని అనుభూతి.
ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న సామి–2 చిత్రంలో పాటలన్నీ సూపర్గా వచ్చాయని, అందుకు కారణం దేవీశ్రీప్రసాద్ అంకితభావం, శ్రమేనని చిత్ర యూనిట్ అభినందిస్తున్నారు.