సంక్రాంతికి విడుదలైన ‘జై సింహా’ ఇంకా మూడవ వారానికి రాకుండానే ఈమూవీ 50 కోట్ల కలక్షన్స్ వసూలు చేసి 50 కోట్ల క్లబ్ లో చేరింది అంటూ ఈమూవీ నిర్మాతలు ప్రచారం చేస్తూ విడుదల చేసిన పోస్టర్లు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు అన్నీ ఘోర పరాజయం పొందడంతో వాటిలో కొద్దిలో కొద్దిగా ‘జైసింహా’ కలక్షన్స్ పరంగా నిలబడినా ఈసినిమాకు అప్పుడే 50 కోట్ల కలక్షన్స్ ఎక్కడ వచ్చాయి అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.

JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ‘జై సింహా’ కు 26 కోట్ల షేర్ ఇప్పటి వరకు వచ్చింది అని అంటున్నారు. ఈసినిమాకు మొదటి పది రోజుల్లోనూ గ్రాస్ కలక్షన్స్ సుమారు 44 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలకంటే ‘జై సింహా’ కలక్షన్స్ పరంగా ముందు వరసలో ఉన్నా ఏకంగా 50 కోట్లు ఎక్కడ నుంచి వచ్చిపడ్డాయి అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.  

 JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే ఇప్పటికీ ఈసినిమాకు బిసి సెంటర్లలో ఆదరణ బాగానే లభిస్తున్న నేపధ్యంలో ఈ వారంలో రాబోతున్న శుక్రువారం నుండి ఆదివారం వరకు మూడు వరస సెలవులు వస్తున్న నేపధ్యంలో ‘జై సింహా’ కు గ్రాస్ కలక్షన్స్ పరంగా 50 కోట్ల వరకు వచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు. అయితే ఇంకా ఆ కలక్షన్స్ రాకుండానే ఆ కలక్షన్స్ ను ఊహించుకుని ‘జై సింహా’ నిర్మాతలు పబ్లిసిటీ స్టంట్ గా ఇలాంటి పోస్టర్స్ ను రిలీజ్ చేసి ఉంటారు అంటూ మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

అయితే ఇది అంతా ఈ శుక్రు వారం విడుదల కాబోతున్న అనుష్క ‘భాగమతి’ పై ఆధారపడి ఉంది అన్నది విశ్లేషకుల వాదన ‘భాగమతి’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి దాని మ్యానియా ప్రేక్షకులలో మొదలైతే ‘జై సింహా’ 50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను పొందడం ఒక పగటి కలగా మిగిలి పోతుంది. ఏమైనా నందమూరి బాలకృష్ణ అభిమానులకు ముందుగానే జోష్ ను ఇవ్వడానికి ఇలాంటి పబ్లిసిటీ పోస్టర్లు విడుదల చేసి ఉంటారు అని ఫలిం నగర్ టాక్..

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: