ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకముందే..అన్ని విషయాలు లీక్ అవుతూ సోషల్ మీడియాలో టాం టాం అవుతున్నాయి.  అయితే సినిమా రిలీజ్ కి ముందు జరిగే స్టంట్ అనుకోవొచ్చు..లేదా కొంత మంది కావాలనే చేసే లీక్ లు కావొచ్చు..ఓ సినిమా గురించి మాత్రం నెటిజన్లు ఇలాంటి విషయాల్లో తెగ ఆరాటపడుతున్నారు.  పెద్ద సినిమాల స్టోరీ లీక్ అని ఎన్నో కథనాలు వస్తున్నాయి..తీరా థియేటర్లోకి వెళ్లి చూస్తే లీక్ కథనాలకు అసలు సినిమాలకు లింక్ ఏమాత్రం ఉండదు..కొన్ని సార్లు సిమిలర్ గా కలిసే ఛాన్స్ కూడా ఉంటుంది.  తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం రంగస్థలం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమారు రూ.100 కోట్ల వ్యయంతో రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 
 Image result for ram charan rangasthalam movie stills
ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా నెలలు గడుస్తుంది. వాస్తవానికి ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా..కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ కాలేదు..అంతే కాదు కొన్ని సీన్లు రీ షూట్ చేస్తున్నట్లు టాక్.  ఇదిలా ఉంటే..‘రంగస్థలం’ స్టోరీ లీక్ అయ్యిందంటూ..సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతుంది.  సినిమాకు సంబంధించిన కథ చూస్తే..చిట్టిబాబు (రాంచరణ్) తండ్రి (రాజీవ్ కనకాల) ఓ వర్గానికి నాయకుడు. చిట్టిబాబు చిన్నతనంలోనే వర్గ విభేదాల కారణంగా తండ్రిని కోల్పోతాడు. తన తండ్రిని మట్టుబెట్టిన వారెవరూ అని తెలుసుకొంటూ చిట్టిబాబు వారిని అంతం చేయటమే సినిమా కథ.  ఈ నేపథ్యంలో రాంచరణ్ లుకింగ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట..అంతే కాదు రివేంజ్ కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉంటుందట. 
Image result for ram charan rangasthalam movie stills
పట్నం వాసన ఏమాత్రం తగటకుండా..రంగస్థలం కథ 60వ దశకంలో ప్రారంభమై 80వ దశకం వరకు సాగుతుందట. అప్పటి వాతావరణం, పరిస్థితులన్నింటిపై పరిశోధన చేసి దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే విధంగా తెరకెక్కిస్తున్నారనేది తాజా సమాచారం. తన తండ్రిని ఎవరు చంపారనే విషయాన్ని తెలుసుకోవడంపై కథ నడుస్తుందట. పగ, ప్రతీకారం అంశాల మధ్య సమంత, రాంచరణ్ మధ్య ఓ ప్రేమకథ కూడా ఆసక్తికరంగా సాగుతుందట. సినిమా కథ సాధారణంగా అనిపించినా సుకుమార్ స్టయిల్‌లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. సమంత ఈ చిత్రంలో లక్ష్మీ అనే పాత్రను పోషిస్తున్నారని తెలిసింది.
Related image
ఈ చిత్రంలో రాంచరణ్, సమంత కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుంది అనేది తెలిసింది. దాదాపు 20 ఏళ్ల కాల పరిమితిలో జరిగే సంఘటనలు, వాటికి సంబంధించిన కథనాలను ఆసక్తికరంగా ఉంటాయనేది సినీ వర్గాల కథనం. ప్రేక్షకులకు మళ్లీ పాత రోజులు గుర్తు తేవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. రంగస్థలంలో అనసూయ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.
Image result for ram charan rangasthalam movie stills
మర్డర్ కేసుకు సంబంధించిన దర్యాప్తును చేపట్టే అధికారిగా అనసూయ కనిపిస్తుందట. ఈ టాప్ యాంకర్ విభిన్నమైన గెటప్‌తో కనిపించబోతుందట. ఇక ఆదిపినిశెట్టి విషయానికి వస్తే..ఒక ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడట.  గ్రామంలో ఊరి పెద్దలుగా జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారట. ఈ మోతుబరి రైతులు చేసే కుట్రల కారణంగానే రాంచరణ్ కుటుంబం బలైపోతుందట. ఇలాంటి కథతో రంగస్థలం ముస్తాబవుతున్నది. భారీ తారాగణం, బడ్జెట్‌తో రూపొందిన రంగస్థలం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: