మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమాపై ఎలాంటి న్యూస్ బయటకు రావట్లేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. వారి కోసం ఇప్పుడు స్పెషల్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. శ్రీమంతుడు కాంబోలో మహేష్ కొరటాల శివ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


ఇక ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచేస్తున్న మథీ సినిమా క్లైమాక్స్ లోని షూటింగ్ స్పాట్ లైటింగ్ తో సహా ఓ పిక్ షేర్ చేశాడు. సినిమా క్లైమాక్స్ ఇలా ఉండబోతుందని ట్వీట్ చేశాడు. మొత్తానికి భరత్ అనే నేను సినిమా నుండి వచ్చిన అఫిషియల్ పోస్టర్ అందరిని అబ్బురపరుస్తుంది. ఇక ఈ నెల 26న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుందట. 


సినిమా అంచనాలను అందుకుంటే సినిమా కచ్చితంగా రికార్డులను సృష్టించడం ఖాయమని అంటున్నారు. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తుండగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు.


ఏప్రిల్ 27న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకు పోటీగా బన్ని నా పేరు సూర్య కూడా వస్తుందని తెలుస్తుంది. అయితే రెండు చిత్రాల దర్శక నిర్మాతలు రిలీజ్ విషయంలో కాంప్రమైజ్ కు వచ్చినట్టు తెలుస్తుంది. మరి అంచనాలతో వస్తున్న ఈ సినిమా శ్రీమంతుడు రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: