రామ్ గోపాల్ వర్మ లో జ్యూస్ అయిపోయింది అన విమర్శలకు జవాబుగా రామ్ గోపాల్ వర్మ తనలో జ్యూస్  ఇంకా వుందని నిరూపించడానికి, అక్కినేని నాగార్జునతో సినిమా మొదలుపెట్టాడు. తండ్రితో సినిమా సెట్స్ పై ఉండగానే కొడుకు కోసం ఒక కథ రెడీ చేసేశాడు. పూర్తి వివరాల లోకి వెళ్తే నాగార్జునతో సినిమా చేస్తుండగానే రాంగోపాల్ వర్మ. అఖిల్ కోసం ఒక కథ రెడీ చేసేశాడు అని ఫిలింనగర్ టాక్.

అంతేకాకుండా అఖిల్‌పై వ‌ర్మ ఓ ట్రైల్ షూట్ చేశాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అసలు విషయమేమిటంటే వర్మ అఖిల్ తో చేసింది ట్రైల్ షూట్ కాదు, ఓ షార్ట్ ఫిల్మ్‌. అవును అఖిల్ ఓ షార్ట్ ఫిల్మ్‌లో న‌టించాడు. దానికి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈమధ్య నాగార్జున షూటింగ్ కి వస్తున్న అఖిల్ కి  షార్ట్ ఫిలిం స్టోరీ వర్మ చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ వినూత్నంగా ఉండ‌బోతోంద‌ట‌. ప‌రిస్థితుల్ని బ‌ట్టి దాన్ని వ‌ద‌లాలా, లేదా అనేది ఆలోచిస్తార‌ట‌.

అయితే ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఫాన్స్ మాత్రం నాగ్ మీద చాలా సీరియస్ అవుతున్నారట. ఇప్పటికే అఖిల్, హలో సినిమాలతో అఖిల్ కెరీర్ నాశనం అయ్యింది అనీ ఇంకా మూర్ఖంగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో అఖిల్ ని ఉంచడం ఏంటి అంటున్నారు వారు. ఫీచర్ ఫిలిం కాకుండా షార్ట్ ఫిలిం కి అయినా సరే తమ అక్కినేని వారసుడు ప్లాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర నటించడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. " దయచేసి ఇలాంటి మూర్ఖపు పనులు చెయ్యకండి " అంటూ నాగార్జున కి ట్విట్టర్ సాక్షిగా మెసేజ్ లు పెడుతున్నారు అక్కినేని అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: