టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు నెలలపాటు నిర్విరామంగా సోషల్ మీడియాలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ మద్య యుద్దం ఓ రేంజ్ లో కొనసాగిన విషయం తెలిసిందే.   పవన్ రాజకీయాల్లోకి రావడంపై కత్తి మహేష్ ఫేస్ బుక్ లో తనదైన స్టైల్లో స్పందించారు.  దీంతో పవన్ ఫ్యాన్స్ కి ఎక్కడో మండింది..అప్పటి నుంచి కత్తిని టార్గెట్ చేసుకొని నానా యాగీ చేశారు.
Image result for కత్తి మహేష్ పవన్ కళ్యాన్
అయితే కత్తి కూడా ఎక్కడా తగ్గకుండా..వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.  పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరైనా దేవుడు అంటే వెంటనే వారిని పిచ్చివారిగా భావించాలని మహేష్ కత్తి సూచించారు. వరుస ప్రశ్నలతో పవన్ ని టార్గెట్ చేసిన కత్తి మహేష్..! ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో రక రకాలుగా కామెంట్ చేశారు కత్తి మహేష్.  ఇదిలా ఉంటే ఈ మద్య కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ కోడిగుడ్లతో దాడి చేశారు. 
Image result for కత్తి మహేష్ పవన్ కళ్యాన్
దీంతో ఆవేశంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టిన కత్తి తర్వాత ఆ కేసు వాపస్ తీసుకున్నారు. అంతే కాదు పవన్ ఫ్యాన్స్ కి కత్తి మద్య సయోద్య కుదిరినట్లు ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు.  దీంతో కత్తి వర్సెస్ పవన్ ప్యాన్స్ మద్య యుద్దం ఆగిపోయిందని అనుకున్నారు అంతా.  స్తుతం పవన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మహేష్ మాత్రం పవన్ తెలంగాణతో కార్యకర్తల భేటి పెట్టడం వ్యూహాత్మక తప్పిదమన్నారు.
Image result for katti mahesh eggs attack
మరోవైపు పవన్ తనకు తెలంగాణ తల్లి పునర్జన్మనిచ్చిందని చెబుతున్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకిని కానని.. తాను పుట్టిన తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టం, ప్రేమ, ప్రాణం కూడా అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మహేష్ ఓ ట్వీట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ అవసరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉంది. తెలంగాణతో పార్టీ కార్యకర్తల భేటీ మొదలుపెట్టడం వ్యూహాత్మక తప్పిదం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: