భారత దేశంలో నిన్న 69 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాధారణంగా సెలబ్రెటీలు జాతీయ పండుగలను తమదైన స్టైల్లో జరుపుకుంటారు. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం తమ కార్యాలయాల్లో జరపుకోవడం చూస్తుంటాం. తాజాగా టాలీవుడ్ లో బిజీగా ఉన్న హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ వాఘా సరిహద్దులో సందడి చేసింది.
రకుల్ ప్రీత్ నటించిన ‘అయ్యారీ’ సినిమా ఈనెల 26నే విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఆర్మీ బ్యాక్డ్రాప్తో నడిచే సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ షార్ట్ ఫిల్మ్ను పోస్టు చేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరింది.
దీంతో ప్రొడ్యూసర్ నీరజ్పాండేతో పాటు నటులు మనోజ్బాజపేయి, సిద్దార్థ మల్హోత్రా, రకుల్ప్రీత్సింగ్, పూజాచోప్రా అమృత్సర్లోని వాఘా సరిహద్దుకు వెళ్లారు. అలాగే బీఎస్ఎఫ్ జవాన్లు కూడా సినీ నటులను కలుసుకుని ఆనందం వ్యక్తంచేశారు. జవాన్లతో కలిసి సెల్ఫీలు దిగారు.
బీఎస్ఎఫ్ అధికారులతో కలిసి ఓ ఇంటరాక్టివ్ సెషన్ను కూడా నిర్వహించారు. కాగా, గతంలోనూ చిత్ర యూనిట్ జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపును సందర్శించింది.నోజ్ బాజ్పేయి కూడా తన ట్విట్టర్ ఖాతాలో బీఎస్ఎఫ్ జవాన్లను కలిసి ఫొటోలను పోస్టు చేశాడు.