కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా ఏక్ థా టైగర్ సూపర్ డూపర్ హిట్ దిశ గా సాగుతుంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజే 32 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. కాగా, ఏక్ థా టైగర్ సినిమాను పాకిస్థాన్ లో విడుదల చేయడానికి ఆ దేశ సెన్సార్ బోర్డు అనుమతించలేదు. దీంతో ఈ సినిమా పాక్ లో విడుదల కాలేదు. దీంతో హీరో సల్మాన్ సినిమాలకు పాకిస్తాన్ లో పెద్ద అదరణ ఉంటుందని, ఏక్ థా టైగర్ ను అక్కడ విడుదల చేయక పోవడం నిరాశ పరుస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఇది వరకు సైఫ్ అలీఖాన్ నటించిన ఏజెంట్ వినోద్ సినిమాను  విడుదల కాకుండా అడ్డుకుంది పాకిస్థాన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు. 

మరింత సమాచారం తెలుసుకోండి: