విలక్షణ నటుడు మోహన్ బాబు తన మనసులో అనుకున్న మాటలను ఎక్కడా మొహమాటపడకుండా బయట పెట్టేస్తూ ఉంటాడు. ఇటువంటి సందర్భమే నిన్న జరిగిన ‘గాయత్రి’ ఆడియో ఫంక్షన్ లో జరిగింది. అయితే ఎప్పుడూ ఆవేశంగా మాట్లాడే మోహన్ బాబు నిన్న చాల సరదాగా చమత్కారంగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది.

 

ఈసినిమాలో కీలక పాత్రలు పోషించిన శ్రియ అనసూయల పై మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఆ ఫంక్షన్ కు వచ్చిన వారందరికీ తెగ నవ్వును తెప్పించాయి. శ్రియ మంచినటి మాత్రమే కాకుండా గ్లామర్ విషయంలో కూడ ఇప్పటికీ ఆమె టాప్ అని అంటూ శ్రియను చూస్తే తనకు కౌగిలించుకోవాలని అనిపిస్తోందని కానీ విష్ణుకు ఆమె జోడీగా నటించడం వల్ల తాను అలా చేయలేనని కామెంట్ చేసాడు మోహన్ బాబు.

 

అయితే అనసూయను చూస్తే తనకు కౌగిలించుకోవాలని ఉంటుందని దీనికి బహుశా తన పిల్లలు అభ్యంతరం చెప్పరని ఇప్పటి వరకు తన పిల్లలు ఎవ్వరూ అనసూయతో నటించలేదు కాబట్టి తనకు ఆ ఛాన్స్ ఉంది అంటూ జోక్ చేసాడు మోహన్ బాబు.  దీనికితోడు అనసూయ తనను బావ గారూ అని సంబోధించడం వల్ల సంతోషంగా ఉంది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు కలక్షన్ కింగ్.

 

అయితే ఈ ఫంక్షన్ కు అనసూయ కొద్దిగా ఆలస్యంగా రావడంతో మోహన్ బాబు అనసూయను టార్గెట్ చేస్తూ మరొక కామెంట్ చేసాడు. అనసూయ ఈ ఫంక్షన్ కు ఆలస్యంగా వచ్చిన విషయాన్ని నేరుగా చెప్పకుండా ఫ్లైట్ కోసం అయితే గంటన్నర ముందే వెళతామని సినిమా కోసం అరగంట ముందే చేరుకుంటామని మనం చెప్పిన సమయానికే పనివారు రావాలని అనుకుంటామని మనం అంతా కూలీలం అంటూ మోహన్ బాబు అనసూయ వైపు చూస్తూ కామెంట్ చేయడంతో ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది తెగ నవ్వుకున్నారు. మోహన్ బాబు చాల గ్యాప్ తరువాత నటిస్తున్న ఈ ‘గాయత్రి’ సక్సస్ అయితే మరిన్ని సనిమాలు వరసపెట్టి చేయాలని ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు ఉన్నాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: