మాస్ మహరాజ్ రవితేజ హీరోగా టచ్ చేసి చూడు సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిట్ గ్యారెంటీ అంటూ ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు రవితేజ. విక్రం సిరికొండ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్స్ గా నటించారు. 


ఇక ఈ సినిమా పూర్తి కాగానే శ్రీను వైట్లతో మరో సినిమా షురూ చేశాడు రవితేజ. స్టార్స్ తో సినిమాలు తీసి ఫ్లాపులు అందుకున్న శ్రీను వైట్ల ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాడు. అందుకే తనకు వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి హిట్లు ఇచ్చిన డైరక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు మాస్ రాజా. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది.


సినిమా గురించి వచ్చిన మరో వార్త ఏంటంటే సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తాడట. ఇప్పటికే సినిమా టైటిల్ గా అమర్ అక్బర్ ఆంథోని అంటూ ప్రచారం జరుగుతుంది. దాదాపు అది కన్ఫాం అన్నట్టుగానే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాలో త్రిపాత్రాభినయంలో రవితేజ అదరగొడతాడని అంటున్నారు. ఇప్పటికే జై లవ కుశలో తారక్ ట్రిపుల్ రోల్ అదరగొట్టగా ఇప్పుడు రవితేజ కూడా ట్రిపుల్ రోల్ కు సిద్ధమయ్యాడు.  


ముఖ్యంగా మూడు పాత్రల వేరియేషన్స్ చాలా కొత్తగా స్టైలిష్ గా ఉంటాయని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం శ్రీను వైట్ల స్టార్ రేంజ్ మళ్లీ వెనక్కి వచ్చేసినట్టే. మైత్రి మూవీ మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: