మెగాపవర్స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న రంగస్థలం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మార్చి చివర్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. ఇప్పటి వరకు వరుసగా మాస్ సినిమాలు చేసుకుంటూ వస్తోన్న చెర్రీ, క్లాస్ ఇమేజ్ ఉన్న సుక్కు కాంబినేషన్ అనగానే జనాల్లో ఎక్కడా లేని అంచనాలు మొదలయ్యాయి.
ఇక రంగస్థలం ప్రి రిలీజ్ బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. అన్ని ఏరియాల్లోనూ మంచి రేటు పలుకుతోంది. ఈ సినిమాను నైజాంలో రూ.18 కోట్లకు అమ్మారు. ఇది టాప్ రేటు. అయితే రూ.2 కోట్లు మాత్రం మనీ రిటర్న్ గ్యారెంటీ పెట్టారట. ఇక ఈ సినిమాతో తొలిసారి మరో టాప్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ వాళ్లు నైజాం డిస్ట్రిబ్యూటర్ రంగంలోకి దిగుతున్నారు.
సీడెడ్ - బళ్లారి కలిపి 12.06 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే సాయి కొర్రపాటి బళ్లారి హక్కులను దక్కించుకున్నాడు. ఇక రంగస్థలం శాటిలైట్ - ఓవర్సీస్ - డిజిటల్ ఇలా అన్ని బిజినెస్ లలో మైత్రి మూవీ మేకర్స్ బిజినెస్ క్లోజ్ చేసి మొత్తం డబ్బును అందుకుంది.
సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్లో మంచి డిమాండ్ ఉండడంతో ఈ సినిమాకు అక్కడ కూడా టాప్ రేటు పలికినట్టు తెలుస్తోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు పెట్టింది మీడియం బడ్జెట్ అయినప్పటికీ లాభాలు మాత్రం భారీగానే ఉన్నాయి. మరి రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్పామ్ చేస్తుందో ? చూడాలి.