పవన్ కళ్యాణ్ ఏవిషయం పై అయినా క్లారిటీగా ఉండడు అదేవిధంగా క్లారిటీగా మాట్లాడడు. అయినా పవన్ ఏదైనా విషయంపై స్పందించాడు అంటే అది అభిమానులకు మాత్రమే కాకుండా మీడియాకు కూడ హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంటుంది. వరసగా వచ్చిన మూడు పరాజయాల పరాభవంతో పవన్ తాను ఇక సినిమాలు చేయను అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ను తన నిర్ణయం మార్చుకోమని అతడి అభిమానులు మాత్రమే కాకుండా అనేకమంది దర్శక నిర్మాతలు కోరుతూ బహిరంగంగానే ప్రకటనలు ఇస్తున్నారు. 
PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ దగ్గర ముగ్గురు నలుగురు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ లు సుమారు 25 కోట్ల వరకు ఉన్నాయి అని టాక్. అయితే ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత పవన్ సినిమాలకు సంబంధించి తన అస్త్రసన్యాసాన్ని ప్రకటించడంతో ప్రస్తుతం పవన్ దగ్గర ఉన్న నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ ల పై చర్చలు మొదలు అయ్యాయి. వాస్తవానికి టాప్ హీరోలు కొన్ని కారణాల వల్ల తాము సినిమాలు చేయము అని చెప్పినప్పుడు వారు తీసుకున్న భారీ అడ్వాన్స్ లు వడ్డీతో సహా తిరిగి ఇచ్చి వేయడం సాంప్రదాయం. 
PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే పవన్ విషయంలో అడ్వాన్స్ లు ఇచ్చిన ఆ  నిర్మాతలు వడ్డీలు వదులుకుని అసలు ఇస్తే చాలు అని అంటున్నారని టాక్.   ఈపరిస్థుతులలో పవన్ సన్నిహితులు పవర్ స్టార్ కు ఇచ్చిన ఒక సలహా పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. రాబోతున్న ఎన్నికలలోపు ఎదోఒక సినిమాను చేసి ఈ అడ్వాన్స్ ల సమస్యల నుండి విముక్తి పొందమని పవన్ సన్నిహితులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను పవన్ తో ఫైనల్ గా చర్చించడానికి మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన ఒక ప్రముఖ వ్యక్తి అమెరికా నుంచి మరో రెండు రోజుల్లో హైదరాబాద్ రానున్నాడని సమాచారం. 
సంబంధిత చిత్రం
వీరిద్దరూ చాల లోతుగా చర్చలు జరిపి పవన్ నటించే సినిమా విషయమై ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని టాక్. ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం తన సన్నిహితుల సలహాలతో మైత్రీ మూవీస్ కు పవన్ 45 రోజులు కాల్ షీట్స్ ఇచ్చి ఈ సమస్యలకు శాశ్విత పరిష్కారం వెతకడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: