టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గురించి అందరికి తెలిసిందే. ఐదారు సినిమాల తర్వాత సూపర్ అనిపించేసిన హీరోయిన్ కూడా మాములుగానే అనిపించేస్తుంది. అందుకే సినిమా సినిమాకు కొత్త కలరింగ్ తో వస్తుంటారు దర్శక నిర్మాతలు. ఇక ఈమధ్య ముంబై మోడల్స్ ను వదిలేసి మలయాళ భామల వెంట పడిన మన డైరక్టర్స్ ఇప్పుడు కన్నడ భామ కోసం క్యూ కడుతున్నారు.


కన్నడ కిర్రిక్ పార్టీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక మందన తెలుగులో చేసిన మొదటి సినిమా ఛలో. ఈ సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్ ఆడియెన్స్ ను అమ్మడు విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తుంది.


ఇక ఛలో సూపర్ హిట్ అయ్యే సరికి అదే హీరోయిన్ ను తన తర్వాత సినిమాలో కూడా కావాలని చెప్పాడట విజయ్. అర్జున్ రెడ్డి తర్వాత మనవాడి రేంజ్ అందరికి తెలిసిందే. పరశురాం సినిమాలో రష్మికతో రొమాన్స్ బాగా వచ్చిందని చెప్పడంతో ఆమెతోనే మళ్లీ తర్వాత సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.


ఛలో తర్వాత చేస్తున్న విజయ్ దేవరకొండ సినిమా కూడా హిట్ పడితే ఇక రష్మికకు తెలుగులో మంచి పాపులారిటీ వచ్చేస్తుంది. అందం, అభినయం రెండిటితో ఆకట్టుకుంటున్న రష్మిక చూస్తుంటే తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అమ్మడు టాలీవుడ్ కెరియర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: