ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రస్తుతం నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది. నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది రామ్ అని అందరికి తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత అమ్మడి కెరియర్ ఏ రేంజ్ లో వెళ్లిందో తెలుసు.


ఉన్నది ఒకటే జిందగి సినిమా తర్వాత రామ్ కథల విషయంలో కాస్త ఆచి తూచి అడుగులేస్తున్నాడు. నేను శైలజ డైరక్టర్ తో తీసినా సరే ఉన్నది ఒకటే జిందగి సినిమా అంతగా కనెక్ట్ అవలేదు. అందుకే సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో హిట్లు అందుకున్న త్రినాధ రావు సినిమాతో వస్తున్నాడు. 


ఇక ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో రామ్ సినిమా ఉండబోతుందట. గరుడవేగ తర్వాత ప్రవీణ్ సత్తారు సినిమా అంటే ఓ క్రేజ్ ఏర్పడింది. యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కు చాన్నాళ్లకు సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ ప్రవీణ్ సత్తారు. అసలైతే నితిన్ తో సినిమా చేయాలనుకున్న ప్రవీణ్ ఆ సినిమా ఎందుకో అటకెక్కడంతో రామ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. 


నితిన్ తో చేయాల్సిన కథతోనే రామ్ తో చేస్తున్నాడని అంటున్నారు. ఆ విషయం మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న రాం త్రినాధరావు, ప్రవీణ్ సత్తారు సినిమాలతో రెండు హిట్లు కొట్టాలని చూస్తున్నాడు. మరి రాం కు ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: