సూపర్ స్టార్ రజిని, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రోబో సీక్వల్ మూవీ 2.ఓ ఎప్రిల్ 27న వస్తుందని ఎనౌన్స్ చేసి కంగారు పెట్టించేశారు. అదే రోజు రిలీజ్ అనుకున్న మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య కన్ ఫ్యూజన్ లో పడ్డారు. 450 కోట్ల బడ్జెట్ తో వస్తున్న 2.ఓకి పోటీగా సినిమా అంటే కష్టమే అనుకున్నారు. 


అయితే ఏప్రిల్ 27 నుండి 2.ఓ ఏప్రిల్ 14కు వచ్చే సరికి అంతా గాలి పీల్చుకున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2.ఓ అసలు సమ్మర్ రేసులోనే లేదు అనేసరికి ఇంకా ప్రశాంతం అనుకున్నారు. అయితే 2.ఓ టెన్షన్ వదిలింది అనుకుంటే కొత్తగా కాలా టెన్షన్ పట్టుకుంది తెలుగు స్టార్స్ కు. అదేంటి అంటే.. రజిని 2.ఓ వాయిదా పడుతుందని తెలిసి.. పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న కాలా సినిమాను రిలీజ్ చేస్తున్నారట. 


ఏప్రిల్ 27న కాలా రిలీజ్ అని ఆ సినిమా నిర్మాత ధనుష్ ఎనౌన్స్ చేశాడు. 2.ఓ వాయిదా పడ్డది కనుక ఆ సినిమా రిలీజ్ అనుకున్న ఏప్రిల్ 14నే కాలా రిలీజ్ చేస్తే బాగుండేది. కాని అలా కాకుండా ఏప్రిల్ 27న రిలీజ్ అని అంటున్నారు. ఇది మళ్లీ మహేష్, బన్ని సినిమాలతో క్లాష్ ఏర్పడేలా ఉంది. అసలే కబాలి కాంబో ఈసారి పక్కా హిట్ అంటున్నారు.


మరోపక్క అసలు ఏప్రిల్ 27న మహేష్ భరత్ అనే నేను, బన్ని నా పేరు సూర్య ఈ రెండు కన్ఫాంగా వస్తున్నాయా లేదా ఏదైనా సినిమ వెనక్కి తగ్గుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే రెండు సినిమాలు అదే రిలీజ్ డేట్ కు ఎగబడుతున్నాయి. మరి ఫైనల్ గా ఏ సినిమా ఆ డేట్ న వస్తుంది అన్నది చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: