కత్తి మహేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. బిగ్ బాస్ అనే షోలో వచ్చే వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక ఆ షో ద్వారా తెలిసింది కేవలం బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే. అయితే అనూహ్యంగా సినీనటుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ కు నటనరాదు, అసలు అతను నటుడు కాదని ఆరోపించి పెద్ద దుమారాన్నే లేపాడు. ఇక పవణ్ ఫ్యాన్స్ కు మరియు కత్తికి మధ్య కొన్ని నెలలు వివాదం జరిగి ఇటీవలే సమసిపోయిన విషయం తెలిసిందే.


అయితే వివాదం నడుస్తున్న టైములో ఒక న్యూస్ ఛానెల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి హాజరయిన కత్తి మహేష్ కు దర్శకుడు వివేక్ నుండి అనూహ్య ప్రశ్న ఎదురయింది. తన తల్లి గురించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా వివేక్ కత్తిని కోరారు. కాగా ఆ ప్రశ్నకి సమాధానం తెలపకుండా కత్తి మహేష్ స్టూడియో నుండి వాకౌట్ చేశారు. దీనికి సంబంధించి కత్తిని సోషల్ మీడియాలో బాగానే ఆడేసుకున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్లో ఏమీ రాయకుండా కత్తిని ఉద్దేశించి నవ్వుతున్న ఎమోజీలు పెట్టాడు. 


కత్తి కూడా సరైన సమయం కోసం వెయిట్ చేసాడేమో కాని , ఇంటిలిజెంట్ రివ్యూ చెప్పి తన కసి తీర్చుకున్నాడు. అంతే కాకుండా ట్విట్టర్లో స్పందిస్తూ - " హీరో ఫ్యాన్స్ వల్ల సినిమాలు హిట్ ఆవ్వవు. ప్రేక్షకులు అందరూ, 'సినిమా బాగుంది' అని చూస్తే సినిమాలు హిట్ అవుతాయి. ఇప్పటికైనా అటు హీరోలు, ఇటు ఫ్యాన్స్ బుద్ధి తెచ్చుకుని,ఇమేజ్ చట్రాలు, ఫ్యాన్స్ కోరికలు అని పోకుండా కథ మీద, దర్శకుడి ప్రతిభ మీద గౌరవం ఉంచి సినిమాలు చేస్తే బెటర్" అని తేజ్ కు కౌంటర్ గా రాసుకొచ్చాడు. ప్రజలు మాత్రం అయిపోయిన వివాదాన్ని కత్తి మళ్ళీ తేవడం అవసరమా అని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: