ప్రముఖ తమిళ దర్శకుడు వైజీ మహేంద్ర కుమారుడు హర్షవర్థన్ పెళ్లి  అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహా మహోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు హాజరయ్యారు. రజనీతో పాటు ఆయన సతీమణి లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు ధనుష్ వెళ్లారు. రజనీకాంత్ సతీమణి లతకు దర్శకుడు వైజీ మహేంద్ర బంధువు.

అప్పట్లో రజనీకాంత్ కు లతను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులను ఒప్పించాడు దర్శకుడు వైజీ మహేంద్ర.పెళ్లికి హాజరైన రజనీ కుటుంబసభ్యుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, మహేంద్రకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసకు సోదరుడవుతారని సమాచారం.

మహేంద్ర తన సినీ ప్రయాణంలో దాదాపు 200 సినిమాల్లో నటించారు. పలు టెలివిజన్‌ సిరీస్‌లోనూ నటించారు. ఇక రజనీ విషయాన్ని వస్తే.. కాలా’, ‘2.0’ సినిమా షూటింగ్‌లు పూర్తి చేశారు. ‘కాలా’ను ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. 2.0 ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: