మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ కొండచిలువతో దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా థామస్ తమ్ముడితో కలిసి క్యూట్ డబ్ స్మాష్ లను పెడుతూ సోషల్ మీడియాకు టచ్ లో ఉంటుంది.


నాని జెంటిల్మన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నివేదా ఆ తర్వాత నిన్ను కోరి, జై లవ కుశ సినిమాలతో అలరించింది. ఇక పైతాన్ తో ఫోటో దిగిన అమ్మడు వాటిని తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది. బాబ్రాతో పిక్ సంతోషాన్ని ఇచ్చింది. కాని అంత సులభమైన పనేం కాదు అంటూ పిక్స్ తో పాటు మెసేజ్ పెట్టింది.


ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూ అలరిస్తున్న నివేదా అటు మలయాళంలో కూడా వరుస అవకాశాలను అందుకుంటుందట. నానితో నివేదా హిట్ పెయిర్ అని చెప్పొచ్చు. మరోసారి ఈ ఇద్దరు కలిసి ఏ సినిమాకు చేస్తారో అని ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొండచిలువతో ఇంత డేర్ గా ఫోటో దిగిన అమ్మడికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు.


నువ్వు చాలా గ్రేట్.. నీకెలా ఇది సాధ్యమైంది.. నువ్వు సూపర్ నివేదా ఇలాంటి కామెంట్స్ తో తన ఇన్ బాక్స్ ఫుల్ అయిపోతుంది. మొత్తానికి క్రేజీ పిక్ తో తన గురించి సోషల్ మీడియా స్థంభింప చేస్తున్న నివేదా సినిమాలతో కూడా ఫ్యాన్స్ ను అలరించాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: